హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్-2 లో కలబ్ గూర్ నుంచి హైదర్ నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ లీకేజీలను అరికట్టేందుకు తేది.24.09.2025, బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా తేది.25.09.2025, గురువారం ఉదయం 6 గంటల వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు.
కావున ఈ 24 గంటలు కింద పేర్కొన్న కొన్ని ప్రాంతాల్లో ప్రెజర్తో నీటిసరఫరా, మరికొన్ని ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం కలుగుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
- ఓ అండ్ ఎం డివిజన్ 17: ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్.
- ఓ అండ్ ఎం డివిజన్ 22: బీరంగూడ, అమీన్ పూర్.
- ట్రాన్స్ మిషన్ డివిజన్ 2: ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లు.
- ఓ అండ్ ఎం డివిజన్ 6: ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్.
- ఓ అండ్ ఎం డివిజన్ 9: కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్
కాబట్టి.. పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని జల మండలి అధికారులు సూచించారు.