
బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా.. ఓ ప్రయాణికుడు కాక్పిట్ డోర్ తెరవడానికి ప్రయత్నించారు. హైజాక్ భయంతో పైలట్ తలుపు తెరవకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. విమానం సురక్షితంగా వారణాసి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. వెంటనే CISF సిబ్బంది జోక్యం చేసుకుని, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా టాయిలెట్ కోసం వెతుకుతుండగా ఆ ప్రయాణీకుడు కాక్పిట్ వరకు నడిచి వెళ్లడంతో ఈ గందరగోళం చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.