తెలంగాణలో అతి పెద్ద పండుగలలో ఒకటైన దసరాతో పాటు బతుకమ్మ పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ పండుగల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పూల డిమాండ్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. నవరాత్రి వేడుకలతో కూడిన ఈ పండుగల సమయంలో పూలకు గిరాకి పెరగడం సహజమే. హైదరాబాద్లోని పూల మార్కెట్లో ప్రస్తుతం తీవ్రమైన రద్దీ నెలకొని ఉంది. వ్యాపారుల ప్రకారం, బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజుల పాటు పూలతో అలంకరించే ఆచారం ఉండటం వలన పూల డిమాండ్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. బెంగళూరుతో సహా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పూలు దిగుమతి అవుతున్నాయి. వినాయక చవితితో పోలిస్తే ఈసారి పూల ధరలు కొంత తగ్గినట్లు వినియోగదారులు తెలియజేస్తున్నారు. వినాయక చవితి సమయంలో కిలో చామంతి పూల ధర 500 రూపాయలు ఉండగా, ప్రస్తుతం 150 రూపాయలకు దొరుకుతున్నాయి. ఇతర రకాల పూల ధరలు కూడా 200 రూపాయల లోపే ఉన్నాయి. గులాబీ పూలు 160 నుంచి 180 రూపాయల వరకు లభిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :