తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పండుగలలో బతుకమ్మ ఒకటి. తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ ప్రకృతికి, స్త్రీ శక్తికి, సంప్రదాయాలకు ప్రతీక. రంగురంగుల పూలతో అలంకరించబడిన బతుకమ్మలు మహిళల చేత సృష్టించబడి, ఆడపడుచులందరూ కలిసి ఆడుతూ, పాడుతూ, పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం, తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వేయి స్తంభాల గుడిలో రాష్ట్రస్థాయి బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించింది. హనుమకొండలోని ఈ వేయిస్తంభాల గుడి ఆవరణలో ఎంగిలి పూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మరియు నలుగురు మంత్రులు పాల్గొని ఈ పండుగను వైభవంగా జరుపుకున్నారు. గుడి ఆవరణలో మహిళలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. లైటింగ్ ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరి దగ్గరుండి పర్యవేక్షించబడ్డాయి.
మరిన్ని వీడియోల కోసం :