Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉత్కంఠత ఇంకా తగ్గడం లేదు. ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ రెండు జట్లు ఇప్పటికే రెండు సార్లు తలపడ్డాయి. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు రెండుసార్లు తలపడిన ఈ రెండు జట్లు ఫైనల్లో కూడా పోటీపడే అవకాశం ఉంది. ఇది అభిమానులకు ఒక గుడ్ న్యూస్. అయితే, టోర్నమెంట్ ఫార్మాట్ ప్రకారం.. ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడాలంటే, అవి ఎలా ఫైనల్కు చేరుకోవాలో అందుకు సమీకరణాలేంటో తెలుసుకుందాం.
సూపర్-4 దశలో ప్రస్తుత పరిస్థితి
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ రెండూ ప్రస్తుతం సూపర్-4 రౌండ్ మ్యాచ్లు ఆడుతున్నాయి. సూపర్-4 పాయింట్ల పట్టికను పరిశీలిస్తే.. తమ మొదటి మ్యాచ్లో పాకిస్థాన్ను 6 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు అగ్రస్థానంలో ఉంది. భారత్కు 2 పాయింట్లు, నెట్ రన్రేట్ 0.689. మరోవైపు, భారత్తో ఓడిన పాకిస్థాన్ సూపర్-4 పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. దాని నెట్ రన్రేట్ మైనస్ (-0.689). సూపర్-4 రౌండ్లో ఒక్కో మ్యాచ్ ఆడిన తర్వాత బంగ్లాదేశ్ రెండో స్థానంలో, శ్రీలంక మూడో స్థానంలో ఉన్నాయి. బంగ్లాదేశ్ నెట్ రన్రేట్ ప్లస్లో ఉండగా, శ్రీలంక నెట్ రన్రేట్ మైనస్లో ఉంది.
ఫైనల్కు చేరుకోవాలంటే
భారత్, పాకిస్థాన్ ఫైనల్కు ఎలా చేరుకోవాలి, తద్వారా అభిమానులు మూడవసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను చూసే అవకాశం లభిస్తుంది? దీనికి సంబంధించిన ఈక్వేషన్లు ఏంటో చూద్దాం.
సూపర్-4లో భారత్, పాకిస్థాన్ ఇప్పుడు చెరో రెండు మ్యాచ్లు ఆడాలి. భారత జట్టు ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇదే విధంగా గెలుస్తూ వెళ్తే ఫైనల్కు చేరడం ఖాయం. మరోవైపు, సూపర్-4లో భారత్తో ఓడిపోయిన పాకిస్థాన్ ఇప్పుడు తమ తదుపరి రెండు మ్యాచ్లను గెలవాలి. సెప్టెంబర్ 23న శ్రీలంకతో, సెప్టెంబర్ 25న బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లలో పాకిస్థాన్ తప్పనిసరిగా గెలవాలి.
ఇదే జరిగితే ఫైనల్ ఖాయం
ఒకవేళ పాకిస్థాన్ ఈ రెండు మ్యాచ్లలో గెలిచి, అటు భారత్ కూడా సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్తో, సెప్టెంబర్ 26న శ్రీలంకతో జరిగే మ్యాచ్లలో గెలిస్తే, సెప్టెంబర్ 28న జరిగే ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్, పాకిస్థాన్ తలపడటం ఖాయం. మొత్తంగా, బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్ భారత్, పాకిస్థాన్ రెండింటికీ చాలా కీలకం. ఎందుకంటే బంగ్లాదేశ్ సూపర్-4 రౌండ్లో తమ మొదటి మ్యాచ్ గెలిచింది. కాబట్టి ఆ జట్టును ఓడించడం కీలకం.
ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ ఫైనల్కు చేరడం అభిమానులకు ఒక గొప్ప విందు. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్లు క్రికెట్ ప్రపంచంలో అత్యధికంగా చూసే మ్యాచ్లలో ఉంటాయి. ఇరు జట్లు తమ తదుపరి మ్యాచ్లలో విజయం సాధిస్తే, ఫైనల్లో మళ్లీ ఒకరితో ఒకరు తలపడటం ఖాయం. అప్పుడు ఈ టోర్నమెంట్ మరింత ఆసక్తిగా మారుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..