జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, అనేది కామన్. అయితే అక్టోబర్ 24న బుధ గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం చేయనుంది. కుజుడు వృశ్చిక రాశిని పాలించడం, ఆ రాశిలోకే బుధ గ్రహం సంచారం చేయం వలన నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది.
కుంభరాశి : కుంభ రాశి వారికి దీపావళి నుంచి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు అత్యధిక లాభాలు పొందుతారు. ఎవరైతే చాలా రోజుల నుంచి భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకుంటారో వారికి ఇది మంచి సమయం. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారు కూడా అనేక లాభాలు అందుకొని, ఆనందంగా జీవిస్తారు.
మిథున రాశి : అక్టోబర్ 24 తర్వాత మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి. ఆనందకర జీవితం ఉంటుంది.
సింహ రాశి : సింహ రాశి వారికి దీపావళి తర్వాత పట్టిందల్లా బంగారమే కానుంది. కళారంగంలో ఉన్నవారికి అద్భుత ప్రయాజనాలు చేకూరుతాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గిపోయి, డబ్బు పొదుపు చేస్తారు. చేతిలో డబ్బులు ఉండటం వలన ఆనందంగా ఉంటారు. కుంటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది.
మీన రాశి : బుధుడు సంచారం వలన మీన రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అక్టోబర్ 24న, బుధుడు మీన 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అన్ని సౌకర్యాలను అందిస్తాడు. బుధుని అనుగ్రహంతో, కష్టాలు తొలగిపోయి ఇంట్లో ఆనందం , శాంతి నెలకొంటాయి. అనుకున్న పనులన్నీపూర్తి అవుతాయి.