2021 సంవత్సరంలో, ముంబై తీరంలోని ఒక క్రూజ్ నౌకలో డ్రగ్స్ కేసు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడం మరింత కలకలం రేపింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ లేకుండా దాదాపు నెల రోజులు ముంబై జైలులో గడిపారు. ఈ కాలంలో షారూక్ ఖాన్ ఎంతో ఆందోళన చెందారని తెలుస్తోంది. ఈ కేసును వాదించిన ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి, షారూక్ ఖాన్ ,వ్యక్తిగత జోక్యం గురించి తెలిపారు. ఆ సమయంలో రోహత్గి యూకేలో హాలిడేలో ఉన్నారని, షారూక్ ఖాన్ వారిని త్వరగా ముంబైకి రప్పించేందుకు ప్రైవేట్ జెట్ ఆఫర్ చేసినట్లు తెలిపారు. అది కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న కాలం కావడం గమనార్హం. రోహత్గి మొదట ఈ ఆఫర్ ని తిరస్కరించారు. కానీ, షారూక్ ఖాన్ రోహత్గి భార్యతో మాట్లాడి, తన కుమారుడి కేసులో తనను కేవలం ఓ క్లైంట్ గా కాదు, ఓ తండ్రిగా అర్థం చేసుకోవాలని కోరారు. ఈ సంఘటన తర్వాత రోహత్గి కేసును వాదించడానికి సమ్మతించారు. షారూక్ ఖాన్ అన్ని వివరాలను రోహత్గి ముందుంచారు. రెండున్నర రోజుల కష్టపడిన వాదన తర్వాత, ఆర్యన్ ఖాన్ కు బెయిల్ లభించింది.
మరిన్ని వీడియోల కోసం :