ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్కు ముందే ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ Ai+ తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్లు శక్తివంతమైన ఫీచర్లు, సరసమైన ధరలతో మార్కెట్లోకి వచ్చాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఈ ఫోన్లు మరింత తక్కువ ధరలకు లభిస్తాయని కంపెనీ తెలిపింది. ఫ్లిప్కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు ఈ ఆఫర్లు సెప్టెంబర్ 22 నుంచే అందుబాటులోకి రానున్నాయి.
Ai+ స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు
ఈ సేల్లో భాగంగా Ai+ పల్స్ 4G, Ai+ నోవా 5G స్మార్ట్ఫోన్లు గణనీయమైన తగ్గింపులతో లభిస్తున్నాయి. Ai+ పల్స్ 4G అసలు ధర రూ.5,999 కాగా ఇప్పుడు ఇది కేవలం రూ.4,499 కే అందుబాటులో ఉంది. Ai+ నోవా 5G ధర రూ.8,999 నుండి రూ.6,999కి తగ్గింది.
Ai+ స్మార్ట్ఫోన్ల ఫీచర్లు
రెండు ఫోన్లలోనూ అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. రెండు ఫోన్లు 6.7 ఇంచెస్ HD డిస్ప్లేతో వస్తాయి. Ai+ నోవా 120Hz రిఫ్రెష్ రేట్ను కలిగి ఉండగా Ai+ పల్స్ 90Hz రిఫ్రెష్ రేట్ను కలిగి ఉంది. 50MP AI డ్యూయల్ కెమెరా సిస్టమ్తో ఈ ఫోన్లు అద్భుతమైన ఫోటోలను తీస్తాయి. రెండూ 5000mAh బ్యాటరీతో రోజంతా నిలిచి ఉండే బ్యాకప్ ఇస్తాయి. వీటిలో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే స్టోరేజ్ను 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్లు దేశ స్వంత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన NxtQuantum OS పై పనిచేస్తాయి. ఇది వినియోగదారుల ప్రైవసీకి, భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది.
ఎక్కడ కొనాలి?
ఈ ఫోన్లు బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఫ్లిప్కార్ట్లో లభిస్తాయి. ఫ్లిప్కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు 24 గంటల ముందుగానే అంటే సెప్టెంబర్ 22 నుంచే ఈ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. సాధారణ అమ్మకాలు సెప్టెంబర్ 22న మొదలవుతాయి. ఈ స్మార్ట్ఫోన్లు బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, పర్పుల్ వంటి ఐదు రంగులలో అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి