Headlines

గణపతి బప్పా మోరియా.. ‘మోరియా’ ఎవరు? గణేశుడి పేరుతో ఆ పదం ఎందుకు ముడిపడింది? అసలు కథ ఇదే!


Ganpati Bappa Morya Story Telugu: ఈరోజు, సెప్టెంబర్ 14న దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ పూజ సమయంలో భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదించడం మనం తరచూ చూస్తుంటాం. మహారాష్ట్రతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ నినాదం ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే గణపతి పేరుతో ‘మోరియా’ అనే పదం ఎందుకు ముడిపడింది? అసలు ఈ ‘మోరియా’ ఎవరు? దీని వెనుక ఒక ఆసక్తికరమైన భక్తుడి కథ ఉందని చెబుతారు.

‘గణపతి బప్పా మోరియా’ అని ఎందుకు అంటారు?

గణపతి భక్తుడు మోర్యా గోసావి

14వ శతాబ్దానికి చెందిన మోర్యా గోసావి గణపతికి గొప్ప భక్తుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయనకు కర్ణాటకలోని శాలిగ్రామంతో సంబంధం ఉన్నప్పటికీ, అనంతరం పుణేలోని చించ్వాడ్‌లో స్థిరపడ్డారని కథనాలు చెబుతున్నాయి. గణపతిపై ఆయనకు అపారమైన భక్తి ఉండేది. మోర్యా గోసావి గణపతిని ఆరాధిస్తూ, వివిధ క్షేత్రాలను సందర్శిస్తూ తన జీవితాన్ని గడిపారని భక్తుల విశ్వాసం. సిద్ధటేక్, చింతామణి వంటి గణపతి క్షేత్రాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారని చెబుతారు. ఆయన భక్తికి గుర్తుగా చించ్వాడ్ ప్రాంతం గణపతి ఆరాధనలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

మోరియా పేరు గణపతితో ఎలా ముడిపడింది?

భక్తుల విశ్వాసం ప్రకారం, మోర్యా గోసావి భక్తికి ప్రసన్నుడైన గణపతి స్వయంగా ఆయనకు దర్శనమిచ్చి వరం కోరమని అడిగారట. అప్పుడు తన పేరు ఎల్లప్పుడూ గణపతి పేరుతో కలిసి ఉండేలా ఆశీర్వదించాలని మోర్యా గోసావి కోరినట్లు కథనం. అప్పటి నుంచి గణపతి భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదించడం ఆనవాయితీగా మారిందని నమ్ముతారు. గణపతి భక్తుల్లో మోర్యా గోసావికి ఉన్న ప్రత్యేక స్థానానికి ఈ నినాదం ప్రతీకగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి



గణేశుడికే మొదటి పూజ

పౌరాణిక కథనం ప్రకారం, గణేశుడు మొదట పూజించబడే దైవంగా మారడానికి ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి దేవతల మధ్య ఎవరు ముందుగా పూజించబడాలి అనే వివాదం తలెత్తగా, శివుడు గణేశుడు, కార్తికేయుడికి ఓ పరీక్ష పెట్టాడు. భూమి చుట్టూ ప్రదక్షిణ చేసి ముందుగా తిరిగి వచ్చినవారే విజేత అని ప్రకటించాడు. కార్తికేయుడు నెమలిపై బయలుదేరగా, గణేశుడు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేశాడు. వారే సమస్త లోకాలకు ప్రతిరూపమని చెప్పాడు. గణేశుడి జ్ఞానం, భక్తి, తెలివితేటలకు మెచ్చిన శివుడు ఆయననే విజేతగా ప్రకటించి, ఏ శుభకార్యమైనా ముందుగా పూజించబడే వరాన్ని ప్రసాదించాడని పురాణాలు చెబుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *