ప్రకృతిలో ప్రతి జీవి జననం, మరణం వెనుక అనేక ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా జంతు ప్రపంచంలో కోతుల ప్రవర్తన మనుషులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. అడవుల్లో ఎన్నో కోతులు నివసిస్తుంటాయి. కానీ, వాటి సహజ మరణం సంభవించినప్పుడు కళేబరాలు లేదా మృతదేహాలు మనకు సాధారణంగా ఎక్కడా కనిపించవు. అసలు కోతులు చనిపోయేముందు ఏం చేస్తాయి? దీని వెనుక ఉన్న శాస్త్రీయ, పౌరాణిక కారణాలేంటో చూద్దాం.
మరణాన్ని ముందే గ్రహించి ఏకాంతవాసం:
విశ్వాసాలు, కొన్ని పరిశీలనల ప్రకారం.. కోతులు తమ మరణ సమయాన్ని కొన్ని రోజుల ముందే ఊహిస్తాయి. చావు దగ్గరపడిందని తెలిసిన వెంటనే అవి తమ గుంపును వదిలి అడవిలోని అత్యంత లోపలి భాగానికి, నిర్మానుష్య ప్రదేశానికి లేదా పుట్టల వద్దకు వెళ్లిపోతాయి. అక్కడ ఎలాంటి ఆహారం, నీళ్లు తీసుకోకుండా ప్రశాంతంగా, ధ్యానంలాగా మౌనంగా ఉండి ప్రాణాలు వదులుతాయి. చనిపోయిన తర్వాత చెదలు వాటి శరీరాన్ని ఆవహించి మట్టిలో కలిపేస్తాయి.
పౌరాణిక నమ్మకం – శ్రీరాముడి వరం:
రామాయణంలో ఆంజనేయ స్వామి శ్రీరాముడిని ఒక వరం కోరినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. తన మరణం ఎవరికీ ఇబ్బంది కలగకూడదని, తన శరీరం ఇతరులకు కనిపించకుండా చెదలకు ఆహారంగా మారిపోవాలి అని కోరారట. కోతులను ఆంజనేయాంశగా భావిస్తారు కాబట్టి, ఆ వరం వల్లే కోతుల మృతదేహాలు మనుషులకు కంటపడవని భక్తుల నమ్మకం.
ఇవి కూడా చదవండి
శాస్త్రీయ విశ్లేషణ – ప్రకృతి స్వయం శుభ్రత ప్రక్రియ:
విజ్ఞాన శాస్త్రం ప్రకారం, ఇది ప్రకృతిలోని నేచురల్ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థలో భాగం. కోతి చనిపోయిన వెంటనే అడవిలోని నక్కలు, చిరుతలు, గద్దలు, కాకులు వాటిని ఆహారంగా తీసుకుంటాయి. కొన్ని గంటల్లోనే వేలాది పురుగులు, బ్యాక్టీరియా కళేబరాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. మాంసం నశించిన తర్వాత మిగిలిన ఎముకలను ముళ్లపందుల వంటి జంతువులు తమ క్యాన్షియం అవసరాల కోసం నమిలి తినేస్తాయి. ఈ విధంగా సైన్స్, పౌరాణిక విశ్వాసాలు రెండూ కోతుల మరణం వెనుక ఉన్న అద్భుతమైన రహస్యాలను వెల్లడిస్తున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..