Headlines

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్‌.. ఇక ఛార్జీల మోత.. అక్టోబర్‌ 1 నుంచి అమలు!


SBI New Rules: శాలరీ ప్యాకేజీ ఖాతాదారుల కోసం ఇతర బ్యాంకుల ఏటిఎంల నుండి చేసే ఉచిత లావాదేవీల పరిమితిని ఐదుకు తగ్గిస్తున్నట్లు ఎస్‌బిఐ ప్రకటించింది. ప్రస్తుతం నెలకు 10 లావాదేవీలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఇందులో నగదు ఉపసంహరణలు, బ్యాలెన్స్ తనిఖీలు, మినీ-స్టేట్‌మెంట్‌ల వంటి సేవలు ఉంటాయి. ఉచిత పరిమితిని చేరుకున్న తర్వాత నగదు ఉపసంహరణలపై రూ.23 ఛార్జీ విధించనుంది. ఆర్థికేతర లావాదేవీలపై అదనపు జీఎస్‌టీ వర్తిస్తుంది. ఈ మార్పు ఏ ఖాతాదారులకు వర్తిస్తుందో, ఇది మీ ఆర్థిక వ్యవహారాలపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

మీకు ఎస్‌బీఐలో ఖాతా ఉండి, ఇతర బ్యాంకుల ఏటిఎమ్‌ల నుండి తరచుగా డబ్బు విత్‌డ్రా చేస్తుంటే, అక్టోబర్ 1వ తేదీ నుండి మీరు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం నెలకు 10 లావాదేవీలు అదనపు ఛార్జీలు లేకుండా అందుబాటులో ఉండేవి. అయితే, అక్టోబర్ నుండి ఈ సేవ సగానికి తగ్గిపోనుంది. శాలరీ ప్యాకేజీ ఖాతాలు ఉన్నవారికి ఇతర బ్యాంకుల ఏటిఎమ్‌ల నుండి చేసే ఉచిత లావాదేవీల పరిమితిని తగ్గించాలని ఎస్‌బిఐ నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మళ్లీ వరుస సెలవులు..!

కొత్త విధానం ప్రకారం, ప్రతి నెలా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి చేసే ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితంగా ఉంటాయి. ఇందులో కేవలం నగదు ఉపసంహరణలు మాత్రమే ఉండవు. ఏటీఎంలో మీ బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవడం, మినీ స్టేట్‌మెంట్ పొందడం కూడా ఈ పరిమితిలోకే వస్తాయి. దీని అర్థం ఇతర బ్యాంకు ఏటీఎంను తరచుగా ఉపయోగించడం వల్ల మీ నెలవారీ ఉచిత పరిమితి త్వరగా అయిపోవచ్చు.

ఇప్పుడు 10కి బదులుగా కేవలం 5 ఉచిత లావాదేవీలు మాత్రమే:

SBI కొత్త నిబంధన అక్టోబర్ 1, 2026 నుండి అమల్లోకి వస్తుంది. దీని తర్వాత శాలరీ ప్యాకేజీ ఖాతాలు ఉన్న కస్టమర్లు ఇతర బ్యాంకుల ATMలు, ADWMల నుండి నెలకు కేవలం ఐదు ఉచిత లావాదేవీలు మాత్రమే చేసుకోగలరు. ఈ ఐదు లావాదేవీలలో నగదు ఉపసంహరణలతో పాటు ఇతర ఏటీఎం సేవలు కూడా ఉంటాయి. ఉదాహరణకు మీరు రెండుసార్లు నగదు విత్‌డ్రా చేసి, రెండుసార్లు మీ బ్యాలెన్స్ తనిఖీ చేసుకుంటే, నాలుగు లావాదేవీలు పూర్తయినట్లుగా పరిగణిస్తారు. మీరు మినీ స్టేట్‌మెంట్‌ను యాక్సెస్ చేసినప్పటికీ, ఉచిత పరిమితి నుండి ఒక లావాదేవీ తగ్గుతుంది.

ఉచిత పరిమితి ముగిస్తే, మీరు రుసుము చెల్లించవలసి ఉంటుంది:

నెలకు ఐదు ఉచిత లావాదేవీల పరిమితిని దాటిన తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి నగదు విత్‌డ్రా చేయడానికి రుసుము విధిస్తారు. నగదు విత్‌డ్రాలపై ప్రతి లావాదేవీకి రూ.23 చొప్పున, జీఎస్‌టీతో కలిపి ఛార్జీ ఉంటుంది. బ్యాలెన్స్ చెక్‌లు లేదా మినీ-స్టేట్‌మెంట్‌ల వంటి ఆర్థికేతర సేవలపై ప్రతి లావాదేవీకి రూ.11 చొప్పున, జీఎస్‌టీతో కలిపి ఛార్జీ విధిస్తారు. అంటే, అదనపు లావాదేవీలకు బ్యాంకు ఛార్జీలను పెంచలేదని అర్థం. ఉచిత లావాదేవీల సంఖ్యలో మాత్రమే మార్పు చేసింది బ్యాంకు.

ఇది కూడా చదవండి: Bank Account: బ్యాంకు అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన అతిముఖ్యమైన విషయాలు..!

ఎస్‌బిఐ కస్టమర్లందరిపై ప్రభావం పడదు:

ఈ మార్పు గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ నిబంధన అన్ని ఎస్‌బిఐ ఖాతాలకు వర్తించదు. ఇది కేవలం శాలరీ ప్యాకేజీ ఖాతాలు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. మీకు ఎస్‌బిఐలో సాధారణ పొదుపు ఖాతా లేదా మరేదైనా ఖాతా ఉన్నట్లయితే ఈ మార్పు మిమ్మల్ని నేరుగా ప్రభావితం చేయదు. అటువంటి ఖాతాలకు ఉచిత ఏటీఎం లావాదేవీలు, సేవా రుసుములకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలు అమలులో ఉంటాయి.

మీరు ఎస్‌బిఐ ఏటిఎం లేదా ఏడిడబ్ల్యుఎం ఉపయోగిస్తుంటే ఈ మార్పు వల్ల మీకు ఎలాంటి ఆందోళన ఉండదు. ఎస్‌బిఐ సొంత ఏటిఎంలలో జీతం ఖాతాలు ఉన్నవారికి ప్రస్తుత నిబంధనలలో ఎలాంటి మార్పులు లేవు.

కార్డు లేకుండా నగదు ఉపసంహరణ ఉచితం:

కార్డు లేకుండా నగదు ఉపసంహరణల విషయంలో ఎస్‌బీఐ తన వైఖరిని కూడా స్పష్టం చేసింది. ఈ మార్పు వల్ల కార్డు ఉపయోగించకుండా ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే సౌలభ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఎస్‌బిఐ ఏటీఎంలలో గానీ, లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో గానీ కార్డు లేకుండా నగదు ఉపసంహరణలు ఉచితంగానే కొనసాగుతాయి. అయితే భవిష్యత్తులో బ్యాంకు కొత్త నిబంధనలను జారీ చేస్తే ఈ పరిస్థితి మారవచ్చు.

ఇది కూడా చదవండి: JioPC: మీ పాత కంప్యూటర్‌ని కొత్తలా మార్చేయండి.. జియో పీసీ క్లౌడ్ సేవలు ప్రారంభం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *