Headlines

పదేళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా..పేపర్ లీకేజీలపై ఉక్కుపాదం..

పదేళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా..పేపర్ లీకేజీలపై ఉక్కుపాదం..


దేశంలో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల అక్రమాలు మిలియన్ల మంది అభ్యర్థుల భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి, పరీక్షల నిర్వహణ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం చట్టాలను మరింత సవరించి అత్యంత కఠినమైన చర్యలను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్‌లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ఎలా ఉండబోతుంది..? ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియాలంటే పూర్తి డిటెల్స్ లోకి వెళ్లాల్సిందే…

యూపీఎస్సీ (UPSC), ఎస్‌ఎస్‌సీ (SSC), రైల్వే (RRB), ఎన్టీఏ (NTA) నిర్వహించే నీట్ (NEET), నెట్ (NET) వంటి ప్రవేశ, నియామక పరీక్షల్లో పారదర్శకతను పెంచడమే ఈ చట్టసవరణల ప్రధాన లక్ష్యం. పరీక్షల నిర్వహణలో మాల్‌ప్రాక్టీస్, ప్రశ్నాపత్రాల లీకేజీలు, హ్యాకింగ్, అక్రమ ఏజెన్సీల ప్రమేయాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ఈ చట్టం దోహదపడుతుంది. సవరించిన నిబంధనల ప్రకారం అక్రమాలకు పాల్పడే సంస్థలు, వ్యక్తులపై తీవ్రమైన చర్యలు ఉంటాయి. పేపర్ లీక్ చేసే విద్యా మాఫియా, సిండికేట్లు లేదా ప్రైవేట్ సంస్థలకు కనీసం 7 ఏళ్ల నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, కనీసం రూ. 10 కోట్ల వరకు జరిమానా విధించబడుతుంది.

పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ప్రైవేట్ ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడితే రూ. 5 కోట్ల నుండి భారీ జరిమానాలు విధించడమే కాకుండా, వారిని 8 ఏళ్ల పాటు బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన ముఠాలు, దోషుల ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని కూడా ఈ చట్టం కల్పిస్తుంది. ఈ చట్టం కింద నమోదు అయ్యే కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. పోలీసు లేదా కేంద్ర విచారణ సంస్థలు 2 నెలల్లో విచారణ పూర్తి చేయాలని, కోర్టులు ఛార్జ్‌షీట్ దాఖలైన 3 నెలల్లో తీర్పు వెలువరించాలని కాలపరిమితి విధిస్తున్నారు.

ఇవి కూడా చదవండి



ఈ చట్టం ప్రధానంగా పరీక్షల నిర్వహణలో లాభపడే లీకేజీ ముఠాలు, హ్యాకర్లు, ఏజెంట్లు, పరీక్షా కేంద్రాల యాజమాన్యాలను శిక్షించడానికి రూపొందించబడింది. సాధారణ అభ్యర్థులకు విచారణల పేరుతో ఎలాంటి వేధింపులు ఉండకుండా, పరీక్షల నిర్వహణ ఏజెన్సీల అంతర్గత నిబంధనల పరిధిలోనే వారిపై చర్యలు ఉండేలా స్పష్టతనిచ్చారు. ఈ క్రమంలోనే టెక్నాలజీ నిపుణుడు నందన్ నీలేకని నాయకత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *