
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ను భారత జట్టు దక్కించుకుంది. భారత్ అందించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే టీం కేవలం 17.5 ఓవర్లలో 129 పరుగులకే పరిమితమైంది.
భారత్ తరపున యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వికెట్లు తీశారు. బ్రియన్ బెన్నెట్ (32 పరుగులు)ను ఔట్ చేయడం ద్వారా యశ్ తన తొలి టీ20ఐ వికెట్ను సాధించాడు. ప్రిన్స్, బెన్ కర్రన్, సికందర్ రజాలను ఔట్ చేశాడు. తడివానషే మరుమణి, న్యూమాన్ న్యామ్హురి క్రీజులో ఉన్నారు.
అంతకుముందు, హరారేలో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన భారత్, 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 81 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. తిలక్ వర్మ 29 బంతుల్లో 60 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
వైభవ్ సూర్యవంశీ 9 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఇషాన్, శ్రేయస్ అయ్యర్ (25) మూడవ వికెట్కు 66 పరుగులు జోడించగా, ఇషాన్ , తిలక్ నాలుగవ వికెట్కు 94 పరుగులు జతచేశారు. జింబాబ్వే తరఫున, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవా, బ్రయాన్ బెన్నెట్, బ్లెస్సింగ్ ముజరబాని, సికందర్ రజా తలా ఒక వికెట్ తీసుకున్నారు.