Headlines

KKR vs RCB IPL 2026 : నేడు ఆర్సీబీతో కీలక పోరు.. కేకేఆర్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఏం జరగాలి?

KKR vs RCB IPL 2026 : నేడు ఆర్సీబీతో కీలక పోరు.. కేకేఆర్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఏం జరగాలి?


KKR vs RCB IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ స్టేజ్ ముగింపునకు వస్తుండటంతో ప్రతి మ్యాచ్ ప్లేఆఫ్ సమీకరణాలను మార్చేస్తోంది. నేడు రాయ్‌పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య 57వ మ్యాచ్ జరగనుంది. ఈ పోరు కేకేఆర్ భవిష్యత్తును నిర్ణయించనుంది. అజింక్యా రహానే నేతృత్వంలోని కోల్‌కతా జట్టుకు ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం. ఈ సీజన్‌లో కోల్‌కతా ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి, 5 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం 9 పాయింట్లతో, -0.169 నెట్ రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో కేకేఆర్ 8వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్ చేరాలంటే కోల్‌కతాకు ప్రతి అడుగు ముళ్లబాటే.

కేకేఆర్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ నేడు ఆర్సీబీని ఓడించి, తర్వాత వచ్చే మూడు మ్యాచ్‌లను కూడా గెలుచుకుంటే.. కోల్‌కతా ఖాతాలో 17 పాయింట్లు చేరుతాయి. 17 పాయింట్లతో ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండానే నేరుగా ప్లేఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోవచ్చు. కాబట్టి రహానే సేనకు నేటి మ్యాచ్ ఒక సెమీఫైనల్ లాంటిదని చెప్పవచ్చు. చాలామంది అభిమానుల్లో ఉన్న సందేహం ఏమిటంటే.. నేడు ఓడితే కేకేఆర్ ఇంటికేనా? దీనికి సమాధానం కాదనే చెప్పాలి. నేడు ఆర్సీబీ చేతిలో ఓడినా కేకేఆర్ టెక్నికల్‌గా ప్లేఆఫ్ రేసులో ఉంటుంది. కానీ, అప్పుడు పరిస్థితి చాలా క్లిష్టంగా మారుతుంది. నేడు ఓడిపోతే కోల్‌కతా గరిష్టంగా 15 పాయింట్లకు మాత్రమే చేరుకోగలదు. అప్పుడు ఇతర జట్ల గెలుపోటములపై, నెట్ రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. అంటే నేటి ఓటమి కేకేఆర్ ప్లేఆఫ్ ఆశలను దాదాపు సన్నగిల్లేలా చేస్తుంది.

రాయ్‌పూర్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించనుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. కోల్‌కతా బ్యాటర్లు రహానే, శ్రేయాస్ అయ్యర్ తమ ఫామ్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. మరోవైపు విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉండటం ఆర్సీబీకి ప్లస్ పాయింట్. నేటి రాత్రి జరిగే ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో, ఎవరి ప్లేఆఫ్ కలలు చెదిరిపోతాయో చూడాలి. కేకేఆర్ అభిమానులు మాత్రం తమ జట్టు గెలిచి 17 పాయింట్ల దిశగా అడుగులు వేయాలని బలంగా కోరుకుంటున్నారు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఉన్న పోటీని బట్టి చూస్తే 16 కంటే ఎక్కువ పాయింట్లు ఉన్న జట్లకే ప్లేఆఫ్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి రహానే తన వ్యూహాలతో ఆర్సీబీని కట్టడి చేస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *