Headlines

Liquor Prices: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బ్యాడ్‌ న్యూస్‌.. ఆ రాష్ట్ర సామాన్యుల బ్రాండ్లకు షాక్.. ఖరీదైన బ్రాండ్లు ఇక చీప్!

Liquor Prices: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బ్యాడ్‌ న్యూస్‌.. ఆ రాష్ట్ర సామాన్యుల బ్రాండ్లకు షాక్.. ఖరీదైన బ్రాండ్లు ఇక చీప్!


Liquor Prices: కర్ణాటక ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమలు చేసింది. చాలా కాలంగా చర్చలో ఉన్న ఈ విధానాన్ని ఇప్పుడు ఆచరణలోకి తెచ్చారు. దశాబ్దాలుగా అనుసరిస్తున్న ఎక్సైజ్ పన్ను విధానాన్ని కర్ణాటక పక్కనపెట్టి, పరిమాణాన్ని బట్టి పన్ను విధించే విధానానికి మారింది. దీంతో రాష్ట్రంలో విక్రయించే వివిధ మద్యం బ్రాండ్ల ధరలు మారనున్నాయి.

పరిమాణం ఆధారంగా మద్యంపై పన్ను విధించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఈ మార్పు వల్ల సామాన్యుడు వినియోగించే చౌక మద్యం ధర పెరుగుతుంది. అదే సమయంలో, ప్రీమియం లేదా విదేశీ బ్రాండ్ల మద్యం ధర తగ్గుతుంది.

ఇది కూడా చదవండి: Gold Price: పసిడి ప్రియులకు భారీ ఊరట.. రూ.31 వేల వరకు తగ్గిన బంగారం ధర..!

ఇవి కూడా చదవండి

కర్ణాటక కొత్త ఎక్సైజ్ విధానం

రాష్ట్రంలో ఇంతకుముందు ఉన్న 16 శ్లాబుల పన్ను విధానం నుండి ఎక్సైజ్ సుంకాన్ని 8 శ్లాబులకు తగ్గించారు. దీనితో సాధారణ మద్యం అంటే 180 మిల్లీలీటర్ల మద్యం ధర 20 నుండి 30 శాతం పెరిగింది. ప్రీమియం బ్రాండ్ల మద్యం ధర 16 నుండి 20 శాతం తగ్గింది. దీనివల్ల స్థానిక మద్యం తయారీదారుల కంటే బహుళజాతి కంపెనీలు అధిక లాభాలు ఆర్జించగలవనే ఆందోళనలు రాష్ట్రంలో పెరిగాయి. ఈ ధరల పెరుగుదల సామాన్యులతో సహా సాధారణ ప్రజలను ప్రీమియం, విదేశీ బ్రాండ్లను ఉపయోగించేలా ప్రోత్సహించవచ్చు. ఇది స్వదేశీ ఉత్పత్తులకు డిమాండ్‌ను తగ్గిస్తుంది.

ఏ బ్రాండ్ల ధరలు పెరుగుతాయి?

కర్ణాటక బ్రూవర్స్ అండ్ డిస్టిలర్స్ అసోసియేషన్ (KBDA) ప్రకారం, మొదటి ఐదు స్లాబులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని 20 నుంచి 30 శాతం వరకు పెంచారు. గతేడాది క్వార్టర్ ధర రూ. 63 ఉండగా, ప్రస్తుతం అది రూ. 80కి అమ్ముడవుతోంది. అయితే, కొత్త విధానం అమలులోకి రావడంతో దాని ధర రూ. 105కి పెరగనుంది.

సాధారణ ప్రజలు ఎక్కువగా విస్కీ, రమ్, బ్రాందీ, వోడ్కా వంటి ఆల్కహాల్ బ్రాండ్‌లను సేవిస్తారు. కానీ కొత్త విధానం అమల్లోకి రావడంతో వీటిలో ఏవీ తక్కువ ధరకు సులభంగా లభించవు. 180 మిల్లీలీటర్ల క్వార్ట్ టెట్రా ప్యాక్‌లు, బాటిళ్ల ధర 20 నుంచి 30 శాతం వరకు పెరుగుతుంది.

ప్రీమియం బ్రాండ్‌లపై ధరల తగ్గింపులు:

సాధారణ మద్యం ధర పెరుగుతుండగా, మరోవైపు ప్రీమియం మద్యం ధర రికార్డు స్థాయిలో తగ్గుతోంది. డియాజియో, పెర్నోడ్ రికార్డ్, యునైటెడ్ స్పిరిట్స్ వంటి మద్యం బ్రాండ్‌ల ధరలు 16 నుంచి 20 శాతం వరకు తగ్గుతాయి. 6 నుంచి 8 స్లాబుల పరిధిలోకి వచ్చే వీటిపై విధించే అదనపు ఎక్సైజ్ సుంకాన్ని 10 నుంచి 15 శాతం వరకు తగ్గించారు. ఇది పెద్ద కంపెనీలకు సహాయపడటానికేనని విమర్శలు కూడా వస్తున్నాయి.

కర్ణాటక మద్యం ధరల విధానాన్ని మార్చే కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేసింది. ఈ సవరించిన విధానం ప్రకారం, తక్కువ ధర కలిగిన మద్యం బ్రాండ్ల ధరలు పెరిగే అవకాశం ఉండగా, ప్రీమియం బ్రాండ్ల ధరలు తగ్గే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Fuel Saving Tips: వార్నీ.. ఇన్నాళ్లు ఈ విషయం తెలియకపాయే.. ఆ టైమ్‌లో పెట్రోల్‌ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *