సెంచరీకి చేరువలో సంచలన ప్రయోగం

సెంచరీకి చేరువలో సంచలన ప్రయోగం


లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులోనూ భారతీయ సినిమా చరిత్రలో మరో సంచలన ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆయన తన 61వ చిత్రంగా సింగ్ గీతంను ప్రకటించారు. ఈ చిత్రం పూర్తిగా పాటలతోనే రూపొందనుంది. ఎటువంటి సంభాషణలు లేకుండా, కేవలం సంగీతం ద్వారానే కథనాన్ని చెప్పే ఈ చిత్రంలో కొత్త నటీనటులు నటించనున్నారు.వయోభారంతో సినిమాలకు కొన్నాళ్లు దూరంగా ఉన్న సింగీతం, వైజయంతి మూవీస్ పతాకంపై నాగ అశ్విన్ పర్యవేక్షణలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. గతంలో పుష్పక విమానం, భైరవ ద్వీపం, ఆదిత్య 369 వంటి విభిన్న జానర్లలో అనేక క్లాసిక్ చిత్రాలను అందించిన సింగీతం, మళ్లీ ప్రయోగాల బాట పట్టడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. సింగ్ గీతం చిత్రం ఎలాంటి ఫలితాలను అందిస్తుందో వేచి చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *