ప్రభుత్వ వైద్య రంగంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న 18 నెలల పసికందును అత్యంత క్లిష్టమైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా కాపాడి, చరిత్ర సృష్టించారు వైద్యులు. కేవలం 10 కిలోల బరువున్న ఆ బాలుడు ‘గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్’ అనే అరుదైన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీనివల్ల కాలేయం పనితీరు దెబ్బతినడంతో బాలుడి తండ్రి తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఉస్మానియా వైద్యుల బృందం దాదాపు 14 గంటల పాటు శ్రమించి అత్యంత క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. తండ్రి నుంచి సేకరించిన కాలేయ భాగాన్ని చిన్నారికి విజయవంతంగా అమర్చారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చయ్యే ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా అందించారు. దేశంలోనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి క్లిష్టమైన సర్జరీలు జరగడం అత్యంత అరుదు. చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ అద్భుత విజయాన్ని సాధించిన ఉస్మానియా డాక్టర్ల బృందాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేకంగా అభినందించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ఉస్మానియా ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదులుతున్న రైలుపై అగ్నికీలలు.. చివరిలో షాకింగ్ ట్విస్ట్
వీడుతున్న ముంబై పుచ్చకాయ మరణాల మిస్టరీ
Singer Mangli: అందుకే మంగ్లీని టార్గెట్ చేశారు.. నోరువిప్పిన శివ చౌహాన్
దేశంలో క్యాన్సర్ మరణ మృదంగం.. దడ పుట్టిస్తున్న ICMR నివేదిక
నాడు “మీసాల పిల్ల” అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్