ఎస్.. ఇదే జరిగింది అల్లూరి ఏజెన్సీలో.. కేవలం బాటసారులు, వాహనదారులే కాదు.. ఆ గ్రామంలోని ప్రజలకు కూడా ఇప్పుడు గొంతు ఎండిపోతోంది. ఓ వర్గం ఆదిపత్యం కారణంగా అక్కడ ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. ఉన్న తాగునీటి బోరుకు తాళాలు పడడంతో.. ఇక ఎవరికి చెప్పుకోవాలో తమ సమస్య తెలియక తలలు పట్టుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ బురడ వీధి. ఆ గ్రామంలో.. భూ వివాదాలు ఉన్నాయి. కొంతకాలంగా రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఒక వర్గం మరో వర్గం పై ఆదిపత్యం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. వాళ్లను ఎలా ఇబ్బంది పెట్టాలా అనేది అనుకుంది ప్రత్యర్థి వర్గం. దీంతో.. ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని అనుకొని.. అక్కడ గ్రామస్తులకు దాహం తీర్చే బోరుపై ప్రతాపం చూపారు. బోరుకు ఐరన్ గొలుసు పెట్టి తాళం వేసేశారు. దీంతో ఆ గ్రామానికి తాగునీటి సమస్య మొదలైంది. సమస్యను లంబసింగి పంచాయతీ కార్యదర్శి దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. ఆమె వచ్చి బోర్ కు వేసిన తాళం తీయించారు. సమస్య పరిష్కారమైందని ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. వెంటనే మళ్ళీ ఆ బోరుకు తాళం పడింది. దీంతో అధికారుల ద్వారా విషయం పోలీసులకు చేరింది.
వీడియో ఇక్కడ చూడండి..
ఇవి కూడా చదవండి
మా పూర్వీకుల నుంచి ఇక్కడ భూ వివాదాలు ఉన్నాయి. కొందరి వల్ల అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని కుటుంబాలకు నీరు ఇవ్వకూడదని బోరుకు తాళాలు వేశారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదు. రోడ్డు పక్కనే ఉన్న ఈ బోరు గ్రామస్తులతో పాటు ప్రయాణికులు కూడా దాహం తీరుస్తుంది. మరో బోరు కూడా శాంక్షన్ చేయించాం. వాళ్లు చెప్పిన ప్రాంతంలో బోరు వేయలేదని ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు ఈ సమస్యను తీర్చాలి.’ అని టీవీ 9 తో అన్నారు బురడ వీధికి చెందిన తిరుపతి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..