ఇంధన కొరత వేళ ఉచితంగా పెట్రోలు పంపిణీ.. ఎక్కడంటే

ఇంధన కొరత వేళ ఉచితంగా పెట్రోలు పంపిణీ.. ఎక్కడంటే


ఏపీలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రాష్ట్రంలోని చాలా పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండగా, స్టాక్ ఉన్న కొన్ని చోట్ల వాహనదారులు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, తిరుపతికి చెందిన ఓ పెట్రోల్ బంక్ యజమాని తన పెద్ద మనసు చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లికి చెందిన పెట్రోల్ బంక్ యజమాని రొమ్మల రాజేష్ రెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్న వేళ, తన బంకులో ఉన్న స్టాక్‌ను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజేష్ రెడ్డి తన ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులకు లీటర్ చొప్పున ఉచితంగా పెట్రోల్ అందజేశారు. ఇప్పటివరకు సుమారు 5,000 మందికి పైగా ఈ సాయం అందించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూలో ఉన్నవారికి మంచినీళ్ల బాటిళ్లను కూడా అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. “తిరుమల వచ్చే భక్తులు, స్థానికులు పడుతున్న కష్టాలు చూసి చలించిపోయానని, అందుకే ఈ చిన్న సాయం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇంధన కొరతను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, క్లిష్ట సమయంలో రాజేష్ రెడ్డి చూపిన చొరవ అభినందనీయం. గతంలోనూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన, బంకులో స్టాక్ ఉన్నంత వరకు సేవలను కొనసాగిస్తానని ప్రకటించారు. ఈ కష్టకాలంలో ఆపన్నహస్తం అందించిన రాజేష్ రెడ్డిపై వాహనదారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

100 అడుగుల నోట్ల దండ.. నిచ్చెన ఎక్కి మరీ.. మెడలో వేసుకున్న వరుడు

అమ్మ ప్రేమకు భాష లేదు.. కదిలించిన దృశ్యం !!

ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో.. మానవాళికి డెత్ వారెంట్.. !

పార్క్‌లో వాకింగ్‌ చేస్తున్నారా.. పన్ను కట్టాల్సిందేనా? అసలేం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *