దక్షిణ భారతీయులకి బ్రేక్ ఫాస్ట్ అంటే రోజూ ఇడ్లీ, దోశ ఉండాల్సిందే. ఇవి తినడానికి అద్భుతంగా ఉంటాయి. ఇందులో దోసకు ప్రత్యేక స్థానం ఉంది. కానీ, ఈ దోశ, ఇడ్లీ పిండి తయారు చేయడమే చాలా పెద్ద పని. అందుకోసమే, సమయం ఆదా చేసుకోవడానికి చాలా మంది వారానికి సరిపడా పిండిని ఒకేసారి రుబ్బి నిల్వ చేసుకుంటారు. కానీ, ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని మీకు తెలుసా? దోస పిండిని 3 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంచడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.ఆ వివరాల్లేంటో ఇక్కడ చూద్దాం..