కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు సజ్జ పిండి, రెండు ఉల్లిపాయలు, అర కప్పు క్యారెట్ తురుము, కొత్తిమీర, రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, తగినంత నీరు, నూనెను తీసుకోవాలి.
ఒక గిన్నెలో సజ్జల పిండి, రెండు ఉల్లిపాయలు , ఇంకా క్యారెట్, నాలుగు పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ , కొద్దిగా జీలకర్ర, కొత్తిమీరను వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇంకా ఉప్పును వేసి కొద్దిగా నీళ్లు పోసి దీనిని ముద్దలాగా చేసుకోవాలి.
తక్కువ నూనెలో వీటినిన్ డీప్ ఫ్రై లాగా కాకుండా దోరగా చేయాలి లేదంటే దానిని పెనం మీద రెండు వైపులా బాగా కాల్చుకోవాలి.
ఈ సజ్జ పిండి , కూరగాయల వడలను పెరుగు లేకపోతే ఏదైనా రోటీ పచ్చడితో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా సాయంత్రం సమయంలో ఇది స్నాక్గా మంచి రుచిని ఇస్తుంది.
ఇంకా కిడ్నీలో రాళ్ళు ఉన్న వారు ఎక్కువగా నీరు తాగాలి అలాగే ఉప్పును తగ్గించి తినాలి ఇంకా ఆక్సలేట్ ఫుడ్స్ లో విషయంలో కొంచం జాగ్రత్తగా ఉండాలి.




