ఇటీవల కాలంలో వినియోగదారులు వంట గ్యాస్ సిలిండర్లు సమయానికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ బుక్ చేసిన తర్వాత కూడా వారాల తరబడి డెలివరీ కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. బుల్లిపేటకు చెందిన ఉందుర్తి మనోహరం 12 రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకున్నాడు. అయితే వారం రోజుల క్రితమే తన సిలిండర్ డెలివరీ అయినట్లు మొబైల్కు OTP మెసేజ్ వచ్చింది. కానీ వాస్తవానికి సిలిండర్ మాత్రం అందలేదు.
ఈ విషయంపై స్థానిక గ్యాస్ ఏజెన్సీని పలుమార్లు సంప్రదించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వకుండా తిరగదొర్లిస్తున్నారని మనోహరం ఆరోపించాడు. చివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆత్రేయపురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. తనలాంటి వినియోగదారులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని బాధితుడు మనోహరం కోరుతున్నాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు.