ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి శరత్ కటారియా రచన, దర్శకత్వం వహించారు. 2015లో విడుదలైన ఈ చిత్రం, తన సరళమైన , వాస్తవిక కథతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా కథ హరిద్వార్లో జరుగుతుంది. ప్రేమ్ (ఆయుష్మాన్ ఖురానా) తక్కువ చదువుకున్న ఒక యువకుడు. తండ్రి భయం వల్ల, తన ఇష్టం లేకపోయినా సంధ్య (భూమి పెడ్నేకర్)ను పెళ్లి చేసుకుంటాడు.