Andhra News: అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..

Andhra News: అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..


తిరుపతి రూరల్ మండలం అడపారెడ్డిపల్లి లో రెండు కుటుంబాల మధ్య స్థలం వివాదం హత్యకు దారి తీసింది. ఇళ్ల మధ్య అడుగు స్థలం కోసం ఏకంగా 40 ఏళ్లుగా రెండు కుటుంబాల మధ్య తగాదా నడుస్తోంది. తాజా ఈ స్థలం కోసం గొడవ జరగ్గా.. ఏలాగైన స్థలాన్ని దక్కించుకోవాలని డిసైడ్ అయిన ఓ వర్గానికి చెందిన వ్యక్తి మరో వర్గానికి చెందిన వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. అడపరెడ్డి పల్లికి చెందిన అమర్నాథ్ రెడ్డి, బొమ్మి రాహుల్ రెడ్డి కుటుంబాల మధ్య అడుగు స్థలం కోసం గత కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. తలం మాకంటే మాకు కావాలని ఇరు వర్గాలు పట్టువదలని పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా ఈ స్థలం కోసం బుధవారం మరోసారి గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో ఎలాగైన అమర్నాథ్ రెడ్డిని అడ్డుతొలగించుకొని స్థలాన్ని సొంతం చేసుకోవాలి అనుకున్న రాహుల్ రెడ్డి అమర్నాథ్ హత్యకు ప్లాన్ వేశాడు.

రాత్రి అందరూ పడుకున్న తర్వాత మెళ్లగా ఇంటి మిద్దెపై పడుకున్న అమర్నాథ్ రెడ్డి వద్దకు వెళ్లిన రాహుల్‌ రెడ్డి కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా అతన్ని హత మార్చాడు. తర్వాత చడీచప్పుడు కాకుండా అక్కడి నుంచి పారిపోయాడు. విషయం బటయకు తెలుస్తుందని.. తన తల్లిదండ్రులను తీసుకొని నిందితుడు రాహుల్ రెడ్డి ఊరు వదిలి పారిపోయాడు. ఉదయం టెరస్‌పై రక్తపు మడుగులో పడి ఉన్న అమర్నాథ్ రెడ్డిని చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అయితే సరిగ్గా అమర్నాథ్ హత్య తర్వాతే రాహుల్ రెడ్డి కుటుంబ కనిపించకపోవడంతో భూ వివాధం నేపథ్యంలో వారే అమర్నాథ్‌ను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆగ్రహంతో రాహుల్ రెడ్డి ఇంటికి, బైక్ కు నిప్పు పెట్టారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *