కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మామిడికాయ ముక్కలు, అర కప్పు జీడిపప్పు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక కప్పు టమోటా ముక్కలు, రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ మిరప పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్
ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.
ముందుగా గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి ఆ తర్వాత దానిలో ఆయిల్ వేసి కరివేపాకు ఆకులు, ఐదు పచ్చిమిర్చిని వేసి బాగా వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ రంగులోకి మారే వరకు బాగా వేయించాలి.
ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వాటిని బాగా ఉడికించాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి వాటిని బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత ముక్కలు బాగా మగ్గిన తర్వాత మిరపపొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసి దాని మీద మూత గట్టిగా పెట్టి మామిడికాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వాటిని బాగా ఉడికించాలి. ఇక చివర్లో నానబెట్టిన జీడిపప్పును దానిలో 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చివర్లో కొత్తిమీర వేసి దించేయాలి.




