Andhra News: రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు.. స్పాట్‌లోనే 8 మంది మృతి

Andhra News: రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు.. స్పాట్‌లోనే 8 మంది మృతి


భక్తులతో వెళ్తున్న ఓ బొలేరో వాహనం మంత్రాలయం సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొట్టి 8 మంది భక్తులు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. వీళ్లంతా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా మరో పదినిమిషాల్లో అంతా ఆలయానికి చేరతారనగా సరిగ్గా చిలకలడోన దగ్గర సిమెంట్ కంకర ట్యాంకర్‌ను ఢీకొట్టింది. లారీ బలంగా ఢీకొట్టడంతో బొలేరో వ్యాన్‌లో ఉన్న వారిలో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు.

మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. 3 సంవత్సరాల బాలికతోపాటు వ్యాన్‌ డ్రైవర్‌ కూడా స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌లకు తరలించారు.

అనంతరం వాహనంలో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. గాయపడ్డ వాళ్లలో కొందరికి సీరియస్‌గా ఉండడంతో వాళ్లను కర్నూలుకి షిఫ్ట్‌ చేసే అవకాశం ఉంది.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు మృతులంతా కర్నాటక వాసులుగా గుర్తించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *