ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి.. ఉదయం 10.31 గంటలకు మంత్రి నారా లోకేశ్ విడుదల చేయనున్నారు. ఒకే సమయంలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,57,899 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 5,31,275 మంది, ద్వితీయ సంవత్సరం 5,26,264 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఇంటర్ ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోండి..
విద్యార్థులు ఇంటర్ ఫలితాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ https://results-bie.ap.gov.in, అలాగే వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే.. TV9Telugu.com ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.. అంతేకాకుండా 9552300009 అనే నంబర్కు ‘Hi’ అని మెసేజ్ పంపి త్వరతగిన ఇంటర్ ఫలితాలను చూడవచ్చు.