సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయారెడ్డి, ఆమె ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. విజయా రెడ్డి భర్త సురేందర్ రెడ్డి మేడిపల్లి పోలీసులను ఆశ్రయించి, తన అత్తమామలు, బావమరిది, వదినపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన ప్రాణాలకు హాని ఉందని, విజయా రెడ్డి ఆత్మహత్య వెనుక తన కుటుంబ సభ్యుల పాత్రపై అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. విజయా రెడ్డి మరణానంతరం తన ఆస్తుల పత్రాలు, బంగారం, డబ్బు తన అత్తగారి వద్ద ఉన్నాయని, వాటిని తిరిగి అడిగితే రూ. 70 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారని సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా, తాను చనిపోతే ఆస్తులు ఎవరికి చెందుతాయని తన అత్తగారు ప్రశ్నించడం తనకు అనుమానాలకు తా విచ్చిందని తెలిపారు. విజయా రెడ్డి హ్యాండ్ బ్యాగ్లు తెరిచి ఉండటం, ఆమె డైరీ, ఇతర కీలక పత్రాలు కనిపించకుండా పోవడం వంటి విషయాలను ఆయన ప్రస్తావించారు.
మరిన్ని వీడియోల కోసం :