ఫస్ట్ నైట్ రోజు గదిలోకి వెళ్లిన వరుడు.. వధువు పెట్టిన కండీషన్‌తో మైండ్ బ్లాంక్.. కట్ చేస్తే..

ఫస్ట్ నైట్ రోజు గదిలోకి వెళ్లిన వరుడు.. వధువు పెట్టిన కండీషన్‌తో మైండ్ బ్లాంక్.. కట్ చేస్తే..


పెళ్లి అంటే రెండు మనసుల కలయిక, ఎన్నో ఆశలతో మొదలయ్యే కొత్త జీవితం. కానీ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక వివాహం మాత్రం ఊహించని మలుపు తిరిగింది. తనను ముట్టుకోవాలంటే లక్షల్లో నగదు ఇవ్వాలంటూ ఒక వధువు ఏకంగా తన భర్తకే కండిషన్ పెట్టింది. ప్రస్తుతం ఈ వింత ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా కోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా జగదీష్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఘనంగా వివాహం ముగిసిన తర్వాత వధువు వరుడి ఇంటికి చేరుకుంది. శోభనం రాత్రి వరుడు ఆశగా గదిలోకి ప్రవేశించగా, వధువు పెట్టిన కండిషన్ విని అతడికి మైండ్ బ్లాక్ అయ్యింది. తనతో కలవాలంటే వెంటనే 90 లక్షల రూపాయల నగదు చెల్లించాలని ఆమె పట్టుబట్టింది. అంత భారీ మొత్తం ఇస్తేనే ఈ పెళ్లికి గుర్తింపు ఉంటుందని, లేదంటే తనను తాకనిచ్చేది లేదని భీష్మించుకు కూర్చుంది.

రణరంగంగా మారిన ఇల్లు

డబ్బు విషయంలో ఇద్దరి మధ్య మొదలైన గొడవ కాస్తా పెద్దదై బయటకు పొక్కింది. వరుడి కుటుంబ సభ్యులు ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పైగా వధువు తన తల్లిదండ్రులకు సమాచారం అందించి.. వారు వచ్చాక మరింత రచ్చ మొదలుపెట్టింది. ఇంట్లోని వస్తువులను పగలగొట్టడమే కాకుండా ఏకంగా గ్యాస్ పైప్‌లైన్‌ను లాగి పారేసి, అందరినీ చంపేస్తానంటూ వీరంగం సృష్టించినట్లు వరుడి కుటుంబం ఆరోపిస్తోంది.

నగలతో పరార్.. కోర్టులో తేలనున్న పంచాయితీ

వధువు అసలు ఉద్దేశం పెళ్లి చేసుకోవడం కాదు, కేవలం డబ్బులు వసూలు చేయడమేనని వరుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. గొడవ ముదిరిన తర్వాత ఇంట్లో ఉన్న బంగారు నగలు, అత్తగారు పెట్టిన ఆభరణాలతో ఆ యువతి అక్కడి నుంచి పారిపోయింది. మొదట పోలీసులు కేసు నమోదు చేయడానికి వెనుకాడటంతో, బాధితులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. పెళ్లి పేరుతో సాగుతున్న ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *