Vaibhav Suryavanshi : రికార్డుల వేటలో బుడ్డోడు.. ఆర్సీబీపై ఊచకోత.. కానీ సెలబ్రేషన్స్‌కు మాత్రం నో.. కారణం ఇదే

Vaibhav Suryavanshi : రికార్డుల వేటలో బుడ్డోడు.. ఆర్సీబీపై ఊచకోత.. కానీ సెలబ్రేషన్స్‌కు మాత్రం నో.. కారణం ఇదే


Vaibhav Suryavanshi : రికార్డుల వేటలో బుడ్డోడు.. ఆర్సీబీపై ఊచకోత.. కానీ సెలబ్రేషన్స్‌కు మాత్రం నో.. కారణం ఇదే

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్‌లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేశాడు, ముంబై ఇండియన్స్‌కు చుక్కలు చూపించాడు.. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పని పట్టాడు. గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ చూసి క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెడుతోంది. అయితే, ఇంతటి ఘన విజయం తర్వాత కూడా ఈ బుజ్జి స్టార్ సెలబ్రేషన్స్‌కు నో చెప్పడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గౌహతిలోని బర్సపరా స్టేడియంలో శుక్రవారం జరిగిన పోరులో వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్‌తో తాండవం చేశాడు. ఆర్సీబీ విధించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ కేవలం 18 ఓవర్లలోనే ఊదేశారంటే అది వైభవ్ పెట్టిన పునాదే కారణం. కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసిన వైభవ్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అంటే అతను చేసిన మొత్తం పరుగుల్లో 74 రన్స్ కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయి. ప్రపంచ స్థాయి బౌలర్లు అయిన జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్‌లను అసలు బౌలర్లుగా కూడా లెక్కచేయకుండా మైదానం నలుమూలలా బాదాడు.

ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు గాను వైభవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే, మ్యాచ్ తర్వాత యాంకర్ అడిగిన ప్రశ్నకు వైభవ్ ఇచ్చిన సమాధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. “నేను ఈ విజయాన్ని ఎంతో సమయం సెలబ్రేట్ చేసుకోలేను. ఎందుకంటే నేను త్వరగా నిద్రపోవాలి. రేపు పొద్దున్నే త్వరగా లేచి పనుల్లో నిమగ్నం కావాలి” అంటూ చాలా అమాయకంగా సమాధానం ఇచ్చాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడి క్రమశిక్షణ చూసి వెటరన్ ప్లేయర్లు సైతం షాక్ అవుతున్నారు.

ఈ సీజన్‌లో వైభవ్ కేవలం ఒక వండర్ లాగా కాకుండా, కన్సిస్టెన్సీ ప్లేయర్ లా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అతను 200 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో అందరికంటే ముందున్నాడు. అంతేకాకుండా, ఇప్పటివరకు అత్యధికంగా 18 సిక్సర్లు బాదిన ఆటగాడు కూడా ఇతనే. దాదాపు 266 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ప్రస్తుతానికి ఐపీఎల్ 2026లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా ముద్ర వేయించుకున్నాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది, ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు ఇలాంటి ఫీట్ సాధించిన ఏకైక భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

వైభవ్ విధ్వంసం తర్వాత మిగిలిన పనిని ధ్రువ్ జురెల్ పూర్తి చేశాడు. జురెల్ కూడా అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. ఒక పక్క ఫిలిప్ సాల్ట్ వంటి స్టార్లు విఫలమై రికార్డులు సృష్టిస్తుంటే, మరోపక్క 15 ఏళ్ల ఈ బీహార్ కుర్రాడు మాత్రం పరుగుల ప్రవాహాన్ని పారిస్తున్నాడు. వైభవ్ ఇదే ఫామ్ కొనసాగిస్తే, ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ రాజస్థాన్ ఖాతాలో చేరడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *