కావాల్సిన పదార్ధాలు : అర కిలో చేపలు, 150 గ్రాముల బెండకాయలు, రెండు పెద్ద ఉల్లిపాయలు, రెండు టమాటాలు, మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, రెండు టీ స్పూన్స్ చింతపండు రసం, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, నాలుగు కరివేపాకు ఆకులు , అర కట్ట కొత్తిమీర.
ముందుగా పచ్చి చేపలను శుభ్రంగా కడిగి ఉప్పు వేసి రెండు సార్లు మళ్ళీ కడగాలి. ఇంకో దానిలో బెండకాయలను తీసుకుని నీళ్ళతో కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కట్ చేసుకోవాలి.
ఒక పాత్రలో ఆయిల్ వేసి అది వేడయ్యాక కరివేపాకు ఆకులు , పచ్చిమిర్చి ముక్కలు , కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. బంగారు కలర్ లోకి మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.
కొద్దీ సేపటి తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా ఉడికించాలి. ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి బాగా కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు వేసి 10 నిమిషాలు బాగా వేయించాలి. ఆ తర్వాత ఒక కప్పు చింత పండును వేసి బాగా మరిగించాలి.
చివర్లో ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసి 15 నిముషాల పాటు బాగా ఉడికించాలి. చివర్లో కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ కూరను వేడి వేడి అన్నంలో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.




