రైల్లో రీల్స్ రచ్చ..ప్రయాణికుడి వీడియో వైరల్‌

రైల్లో రీల్స్ రచ్చ..ప్రయాణికుడి వీడియో వైరల్‌


రైల్లో రీల్స్ రచ్చ..ప్రయాణికుడి వీడియో వైరల్‌

తన బోగీలో 20 నుంచి 30 మంది సభ్యుల కుటుంబం కూడా చేరిందనీ రైలు ఎక్కింది మొదలు ఒకటే గోల. అరుపులు, కేకలు, పాటలతో హోరెత్తించారనీ మన్మోహన్ వర్మ పోస్ట్‌లో తెలిపారు. డ్యాన్స్ చేస్తూ రీల్స్‌తో రచ్చ రచ్చ చేశారనీ ఇతర ప్రయాణీకుల అసౌకర్యాన్ని అస్సలు పట్టించుకోకుండా, వారి ప్రశాంతతకు భంగం కలిగిస్తూ గంటల తరబడి ఇలా నానా యాగీ చేశారనీ రాసుకొచ్చారు. దాంతో చిర్రెత్తు కొచ్చిన అతను రైల్వే హెల్ప్‌లైన్‌కు 139కి ఫిర్యాదు చేసారట. రైల్వే పోలీసులు వచ్చి వారికి వార్నింగ్‌ ఇచ్చారని తెలిపారు. ‘‘రైల్వే కోచ్‌ అనేది పబ్లిక్‌ ప్లేస్‌. మన సొంత స్థలం కాదు.. దురదృష్టవశాత్తు కొంతమంది ప్రయాణీకుల్లో కనీస సివిక్‌ సెన్స్‌ కరువైందంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైలు కోచ్‌ ఒక ప్రైవేట్ లివింగ్ రూమ్ కాదు రీల్-మేకింగ్ సెట్ అంతకన్నా కాదన్నారు. పెద్ద శబ్దాలు చేయకుండా కనీస మర్యాదతో మెలగాలి. తోటి ప్రయాణీకులను గౌరవించాలి. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. అపుడు మాత్రమే ప్రయాణం ఆనందంగా ఉంటుందంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం :

ప్రకృతి ఒడిలో అరుదైన దృశ్యం..జంటపాముల సయ్యాట!

భాగ్యనగరంలో హోటళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కా!

ప్రపంచానికి ‘చమురు’గండం.. ఆగ్నేయాసియాలో ఎనర్జీ ఎమర్జెన్సీ!

మరణం సైతం విడదీయలేని మహా బంధం!

మళ్లీ పెళ్లికి రెడీ అయిన మాజీమంత్రి మల్లారెడ్డి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *