
నడిప్పిన్ నాయగన్ సూర్యతో కలిసి కరుప్పు చిత్రాన్ని తెరకెక్కిస్తున్న డైరెక్టర్, ఈ సినిమా చుట్టూ జరుగుతున్న అనేక వదంతులపై స్పష్టతనిచ్చారు. హీరోతో లేదా నిర్మాతతో ఎలాంటి గొడవలు లేవని, అనవసర ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా కరుప్పు సినిమా ఆగిపోయిందని, కాల్షీట్ల సమస్యల వల్ల షూటింగ్ ఆలస్యమైందని, దర్శకుడికి నిర్మాతకు మధ్య లేదా దర్శకుడికి సూర్యకు మధ్య విభేదాలు ఉన్నాయని పలు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ, అందరూ అనుకుంటున్నట్టుగా కరుప్పు సినిమా ఏప్రిల్ 10న విడుదల కావట్లేదని డైరెక్టర్ వెల్లడించారు. తాను గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్పైనే పని చేస్తున్నానని, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమవుతుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :