
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కెరీర్ కొనసాగించాలంటే అభినయంతో పాటు అందం కూడా ఉండాల్సిందే. అలాగనీ అందమే ప్రామాణికమే కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్ మొదలు నేటి సుహాస్ వరకు చాలా మంది స్టార్ హీరోలుగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే హీరోయిన్ల విషయంలో మాత్రం ఇలా జరగడం లేదు. కలర్ విషయంలో వారు తరచూ అవమానాలు పడుతున్నారు. అలాగే తరచూ బాడీ షేమింగ్ కామెంట్స్ ను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇదే విషయంపై ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ఎన్టీఆర్ తో అశోక్, నరసింహుడు, మెగాస్టార్ చిరంజీవితో జై చిరంజీవ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సమీరా. అలాగే బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందీ అందాల తార. అయితే పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అలాగే సినీ పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాలను షేర్ చేసుకుంది.
‘సినిమా ఇండస్ట్రీలో తెల్ల తోలు వ్యామోహం ఉన్న కొంతమంది నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అసలు రంగు కంటే ఇంకా తెల్లగా కనిపించాలని.. ముఖానికే కాకుండా ఎక్కడైతే శరీరం బయటకు కనిపిస్తుందో అక్కడ కూడా మేకప్ వేసుకోవాలని ఒత్తిడి చేసేవారు. అలా వాళ్లు చెప్పడం వల్ల నేను అందంగా ఉండనేమో అనే ఆత్మన్యూనత నాలో కలిగేది.అలాగే పొట్టిగా, లావుగా ఉందంటూ బాడీ షేమింగ్ కూడా చేశారు. సినిమా ఇండస్ట్రీలో ట్యాలెంట్ కన్నా కూడా బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నన్ను మానసికంగా కలిచి వేసింది’
సమీరా రెడ్డి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ వీడియో..
View this post on Instagram
‘ పెళ్లి, పిల్లల తర్వాత నేను బాగా బరువు పెరిగాను. పోస్ట్ పార్టమ్ వెయిట్ గైన్ అవ్వడం వల్ల నా కాన్ఫిడెన్స్ ను పూర్తిగా కోల్పోయాను. ఆ సమయంలో నెటిజన్లు చేసిన నెగెటివ్ కామెంట్స్ నన్ను మానసిక క్షోభకు గురి చేశాయి. అయితే రెండో బిడ్డకు జన్మనిచ్చాక మాత్రం నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాను. సానుకూల దృక్పథంతో ఆలోచించడం మొదలు పెట్టాను. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంతటి దారుణమైన కామెంట్స్ చేసినా ఇప్పుడు నాకేమీ అనిపించడం లేదు’ అని చెప్పుకొచ్చింది సమీరా రెడ్డి. ప్రస్తుతం ఈ నటి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.