మనలో చాలా మంది ఉగాది రోజున ఇంట్లో పచ్చడిని తయారు చేస్తారు. అయితే, కొందరు తెలియక సాధారణ పాత్రల్లో చేస్తారు. మరి కొందరు నేరుగా ఒక గిన్నె తీసుకుని ఉగాది పచ్చడిలో వేసే ఆరు ఆహార పదార్ధాలును వేసి తయారు చేస్తుంటారు.
అయితే, అలా చేయడం కంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త మట్టి కుండని కొని దానిలో ఉగాది పచ్చడి చేసుకుని తింటే అనారోగ్య సమస్యలతో పాటు ఇప్పటి వరకు మిమ్మల్ని వేధిస్తున్ననర దిష్టి, నర ఘోష ఇలాంటివి అన్ని మాయమవుతయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
మీరు ముందుగా ఒక కొత్త కుండను కొని దానిని ఒక రోజు నీళ్ళలో ఉంచి పండుగ ఉగాది రోజు ఆ కుండను తీసి పసుపు రాసి , కుంకుమ బొట్లు పెట్టి దానిలో మామిడి ముక్కలు, వేప పూత, బెల్లం, పులుపు, చేదు ఇలా అన్ని వేసి దేవుడు దగ్గర పెట్టండి.
ఇలా చేస్తే ఇది ఇంట్లో ప్రతికూల శక్తి పోయి , సానుకూల శక్తి వస్తుంది. అలాగే, లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బును కూడా పొందుతారు. మీరు ఉగాది రోజున కుండను కొని ఇలా చేస్తే చాలా మంచిది. అలాగే, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




