కావాల్సిన పదార్ధాలు: పావు కిలో చికెన్, అర కప్పు శనగపప్పు, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు , కారం, కరివేపాకు, కొత్తిమీర, మసాలా పొడి, నూనెను తీసుకోవాలి.
ముందుగా చికెన్ తీసుకుని బాగా శుభ్ర పరిచి దానిలో ఉన్నా నీటిని తొలగించి 10 నిముషాల పాటు బాగా ఆరనివ్వాలి.
ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపప్పును వేసి మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని కీమాలాగా మెత్తగా అయ్యేలా చేసుకోవాలి.
ఆ తర్వాత దీనిలో తరిగిన ఉల్లిపాయలు ముక్కలు, కరివేపాకు ఆకులు, కొత్తిమీర ఆకులు, ఉప్పు వేసి , కొద్దిగా కారం, గరం మసాలా వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.
ఇప్పుడు చేతులకు నూనె రాసుకుని మినప గారెల్లాగా వేసుకోవాలి. వీటిని రెండు వైపులా బాగా కాలనివ్వాలి. అలా కాలిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. అంతే, వేడి వేడి చికెన్ గారెలు రెడీ.




