Andhra News: కోతుల భయం.. కొండముచ్చు అభయం.. ఆ ఆలయంలో అద్భుత దృశ్యం!

Andhra News: కోతుల భయం.. కొండముచ్చు అభయం.. ఆ ఆలయంలో అద్భుత దృశ్యం!


Andhra News: కోతుల భయం.. కొండముచ్చు అభయం.. ఆ ఆలయంలో అద్భుత దృశ్యం!

ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు స్థానికంగా కోతుల బెడద ఎక్కువ కావడంతో.. వాటని బెడదను తగ్గించేందుకు అధికారులు కొండముచ్చును తీసుకొచ్చి కోతులను తరుముతున్నారు. సాధారణంగా గుంపులుగా వచ్చే కోతులను అదుపు చేయడం మనుషులకు సాధ్యం కావడంకాకపోవడంతో ఆలయ నిర్వాహకులు భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు కొండముచ్చును తీసుకొచ్చారు. కోతులను తరిమివేయడమే కాకుండా ఆలయానికి వచ్చే భక్తులకు ఈ కొండముచ్చు ఆశీర్వదిస్తుండటంతో అధికారుల నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశంజిల్లా అద్దంకి సమీపంలోని శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో గత కొన్ని రోజులుగా కోతుల బెడద పెరిగిపోయింది. ఈ కోతుల బెడదను నివారించేందుకు గతంలో అద్దంకి మున్సిపాలిటీ ఉద్యోగి కోటయ్యకు ఓ కొండముచ్చును ఇచ్చి నిర్వహణ బాధ్యతను అప్పగించారు. ఆ తరువాత కొన్నాళ్ళకు కోటయ్య ఉద్యోగం మానివేయడంతో కొండముచ్చును ఆలయానికి తీసుకురావడం మానేశాడు.

ఈక్రమంలో తిరిగి కోతుల బెడద ఎక్కువ కావడంతో తిరిగి కోటయ్యకు కొండముచ్చును ఆలయ పరిసరాల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. దీంతో కోతుల బెడద కొంతమేర తగ్గిపోయింది. అంతేకాదు భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం అక్కడే ఉన్న కొండముచ్చును చూసి ఆశీర్వాదం అందుకుంటున్నారు. వానరం ఆశీర్వదిస్తే సాక్షాత్తూ ఆ ఆంజనేయస్వామే ఆశీర్వదించినట్టు భావించి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన భక్తులు ఆలయానికి క్యూ కట్టి కొండముచ్చు నుంచి ఆశిర్వాదం పొందుతున్నారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు దేవుని దర్శనంతో పాటు కొండముచ్చు ఆశీర్వాదం తీసుకోవడం పరిపాటిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *