
ఉత్తరప్రదేశ్లో అధికారుల నిర్లక్ష్యానికి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. గూగుల్ మ్యాప్ నమ్ముకుని వెళ్లి, బదౌన్-బరేలీ సరిహద్దులోని రామ్గంగా నదిపై అసంపూర్తిగా ఉన్న వంతెనపై నుండి కారు పడి ముగ్గురు యువకులు మృతి చెందారు. పోలీసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తు తర్వాత, ముగ్గురు ప్రజా పనుల శాఖ (PWD) ఇంజనీర్లను తొలగించారు. ఒక ఇంజనీర్పై చార్జిషీట్ దాఖలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ విషాద ప్రమాదం నవంబర్ 24, 2024న దతగంజ్ ప్రాంతంలోని రామ్గంగా నదిపై జరిగింది. అసంపూర్తిగా ఉన్న వంతెనపై నుండి పడి యువకులు మరణించారు. కారులో ఉన్న ముగ్గురు యువకులు గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి నావిగేట్ చేసిన తర్వాత వంతెన వద్దకు చేరుకున్నారు. అయితే, వంతెన అసంపూర్ణంగా ఉంది. కనీసం తగినంత అడ్డంకులు గానీ, హెచ్చరిక సంకేతాలు లేకపోవడంతో, కారు వంతెన నుండి నేరుగా కింద పడిపోయింది. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు.
ప్రమాదంలో మరణించిన ముగ్గురు యువకులను మెయిన్పురి నివాసి అమిత్ కుమార్, ఫరూఖాబాద్ నివాసి వివేక్ కుమార్, ఫరూఖాబాద్ నివాసి అజిత్ కుమార్గా గుర్తించారు. ఈ ముగ్గురు యువకులు కారులో ప్రయాణిస్తూ ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ప్రమాదం తర్వాత, దతాగంజ్ పోలీస్ స్టేషన్లో నలుగురు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లపై కేసు నమోదైంది. వీరిలో ఇద్దరు అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇద్దరు జూనియర్ ఇంజనీర్లు ఉన్నారు. అసిస్టెంట్ ఇంజనీర్లు మహ్మద్ ఆరిఫ్, అసిస్టెంట్ ఇంజనీర్ అభిషేక్ కుమార్, జూనియర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న అజయ్ గంగ్వార్, మహారాజ్ సింగ్ పై కేసులు నమోదు అయ్యాయి. పోలీసు దర్యాప్తులో నలుగురు ఇంజనీర్ల పాత్రలను పరిశీలించారు. ముగ్గురు ఇంజనీర్లు ఎటువంటి నిర్లక్ష్యం వహించలేదని తేలింది. వారు నిర్దోషులుగా నిర్ధారించారు. అయితే, ఒక ఇంజనీర్ బాధ్యతల నుంచి తప్పించి, అతనిపై చార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు.
ఈ ప్రమాదం తరువాత, అసంపూర్తిగా ఉన్న వంతెనలపై భద్రతా చర్యలు, అడ్డంకులు, హెచ్చరిక సంకేతాలు లేకపోవడంపై అధికారులు, ప్రజా పనుల శాఖ పనితీరుపై ప్రశ్నలు తలెత్తాయి. దీని తరువాత, అసంపూర్తిగా ఉన్న వంతెనలపై భద్రతా ఏర్పాట్లను వెంటనే చేయాలని అధికారులకు సూచనలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..