
పవిత్రమైన చార్ధామ్ యాత్ర (Char Dham Yatra )కు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం భారతీయ రైల్వే పలు మంచి టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ప్రయాణం, టికెట్లు, వసతి, భోజనం వంటి ఎలాంటి సమస్యా లేకుండా ప్రయాణం చేయాలనుకుంటే మాత్రం ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఐఆర్సీటీసీ (IRCTC) టూరిజం భక్తుల కోసం ప్రత్యేకంగా చార్ధామ్ యాత్ర టూర్ ప్యాకేజీని అందిస్తోంది.
ఈ ప్యాకేజీ మొత్తం 12 రోజులు, 11 రాత్రులు ఉంటుంది. ఈ యాత్ర జూన్ 12న విశాఖపట్నం నుంచి ప్రారంభమై జూన్ 23న ముగుస్తుంది. ఈ టూర్లో బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రితో పాటు బార్కోట్, గుప్తకాశి, హరిద్వార్, సోన్ప్రయాగ్ వంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది.
టూర్ షెడ్యూల్
- డే 1
- విశాఖపట్నం నుంచి ఉదయం 08:50 గంటలకు విమానం బయలుదేరి మధ్యాహ్నం 15:55 గంటలకు డెహ్రాడూన్ చేరుకుంటుంది. అక్కడి నుంచి హరిద్వార్కు తీసుకెళ్తారు. హోటల్లో చెక్-ఇన్ అనంతరం హరిద్వార్ దేవాలయాలను సందర్శించి, గంగా హారతిని దర్శించవచ్చు. రాత్రి భోజనం తర్వాత హరిద్వార్లో బస.
- డే 2
- అల్పాహారం తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి బార్కోట్ వైపు ప్రయాణం. సాయంత్రం అక్కడికి చేరుకుని హోటల్లో బస.
- డే 3
- ఉదయం యమునోత్రి ఆలయం దర్శనం కోసం జానకి చట్టికి ప్రయాణం. అక్కడి నుంచి ట్రెక్కింగ్ ద్వారా యమునోత్రి చేరుకుంటారు. దర్శనం అనంతరం తిరిగి జానకి చట్టికి వచ్చి బార్కోట్కు చేరుకుని రాత్రి బస.
- డే 4
- అల్పాహారం తర్వాత ఉత్తరకాశికి బయలుదేరుతారు. మార్గమధ్యలో బ్రహ్మఖల్ సమీపంలోని ప్రకటేశ్వర్ మహాదేవ్ ఆలయం దర్శనం. సాయంత్రం ఉత్తరకాశిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం సందర్శన. రాత్రి బస ఉత్తరకాశిలోనే.
- డే 5
- ఉదయం గంగోత్రి ఆలయానికి బయలుదేరుతారు. భాగీరథి నది తీరాన సాగిన అందమైన ప్రయాణం తర్వాత గంగోత్రి ఆలయంలో గంగాదేవి దర్శనం, పూజలు.
- డే 6
- అల్పాహారం అనంతరం గుప్తకాశి / సీతాపూర్ వైపు ప్రయాణం. సాయంత్రం చేరుకుని రాత్రి బస.
- డే 7
- ఉదయం 4 గంటలకు బయలుదేరి సోన్ప్రయాగ్ ద్వారా గౌరీకుండ్ చేరుకుంటారు. అక్కడి నుంచి ట్రెక్కింగ్ ప్రారంభమై కేదార్నాథ్ చేరుకుంటారు. హోటల్లో చెక్-ఇన్ చేసి రాత్రి బస.
- డే 8
- ఉదయం కేదార్నాథ్ ఆలయంలో పూజ, దర్శనం, అభిషేకం. అనంతరం గౌరీకుండ్ వరకు సుమారు 16 కి.మీ ట్రెక్కింగ్. అక్కడి నుంచి టాక్సీ ద్వారా సోన్ప్రయాగ్ చేరుకుని హోటల్లో బస.
- డే 9
- అల్పాహారం తర్వాత బద్రీనాథ్కు ప్రయాణం. మార్గంలో జోషిమఠ్లోని నర్సింగ్ స్వామి ఆలయం దర్శనం. సాయంత్రం బద్రీనాథ్ ఆలయంలో ఆరతి దర్శనం. రాత్రి బస బద్రీనాథ్లో.
- డే 10
- ఉదయం బద్రీనాథ్ ఆలయంలో అభిషేక దర్శనం. తరువాత బ్రహ్మకపాల్ వద్ద పూజలు, తర్పణం. అనంతరం ఇండో–టిబెట్ సరిహద్దులో ఉన్న భారతదేశపు చివరి గ్రామం మానా సందర్శన. రాత్రి బస రుద్రప్రయాగ్లో.
- డే 11
- రుద్రప్రయాగ్ నుంచి హరిద్వార్కు ప్రయాణం. మార్గంలో మానస దేవి, చండీ దేవి ఆలయాల దర్శనం. రాత్రి బస హరిద్వార్లో.
- డే 12
- అల్పాహారం తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి డెహ్రాడూన్ విమానాశ్రయానికి వెళ్తారు.
మధ్యాహ్నం 4:35 గంటలకు విమానం బయలుదేరి, రాత్రి 10:10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. దీంతో యాత్ర ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధరలు
- సింగిల్ ఆక్యూపెన్సీ: ₹98,765
- డబుల్ ఆక్యూపెన్సీ: ₹87,510
- ట్రిపుల్ ఆక్యూపెన్సీ: ₹83,010
- చైల్డ్ విత్ బెడ్: ₹54,495
- చైల్డ్ వితౌట్ బెడ్: ₹42,585
ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం IRCTC టూరిజం అధికారిక వెబ్సైట్
www.irctctourism.com
ను సందర్శించవచ్చు.