2026 ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. క్రికెట్ ప్రేమికులు అందరు, ఆసక్తిగా ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు, 2026 మార్చి 8 ఆదివారం రోజున పురుషుల ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో , భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. దీంతో భారతీయులు , ఇండియా గెలవాలని కోరుకుంటున్నారు. మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇండియా కప్ కొడుతుందో లేదో చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు కుజ గ్రహం, బృహస్పతి, చాలా శక్తివంతమైన ఈ రెండూ గ్రహాలు, భారత్ జట్టు ఐదవ ఇంటిలోకి ప్రవేశించనున్నాయి. ముఖ్యంగా కుజుడు మకర రాశిలో బలంగా ఉన్నాడు. దీని వలన ఇది భారత్ జట్టుకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, పోరాట స్పూర్తిని ఇస్తుంది.
గ్రహాల కదలికలను బట్టి చూస్తే, మ్యాచ్ సమయంలో కర్కాటక రాశిలో ఉన్న చంద్రుడు సూర్యుడితో త్రికోణాన్ని ఏర్పరచుకుంటున్నాడు. ఇది భారత జట్టుకు స్థిరత్వాన్ని అందిస్తుంది. అలాగే వీరు మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు. ఆటపై వీరి దృష్టి ఉంటుంది. ముఖ్యంగా ఛేజింగ్ సమయంలో అసమానమైన బలాన్ని అందిస్తుంది.
ఇక న్యూజిలాండ్ జట్టు జాతకంలో శని సంచారం ఉంది. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితులను ఏర్పరుస్తుంది. అలాగే బుధుడి తిరోగమన కదలికలు కివీస్ జట్టు వ్యూహాలలో కాస్త గందరగోళాన్ని సృష్టించే ఛాన్స్ ఉంది, ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, క్యాచ్ వదిలి వేయడం లేదా? పవర్ ప్లేలో పరుగులు ఇవ్వడానికి దారితీస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల అనుకూలం వలన, ప్రతి ఆటగాడి , ఆటతీరు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే సూర్యుడి బలం వలన ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఇక మ్యాచ్ రెండవ భాగంలో జట్టు ఫీల్డింగ్ ఆకట్టుకుంటుంది. చాలా వరకు ఈ కప్ భారత్దే అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
ఈ ఫైనల్ పోరులో భారత్ దాదాపు 180 పరుగులకు గాను అద్భుతమైన బ్యాటింగ్ను ఎంచుకుంటుంది. పండితుల అభిప్రాయం ప్రకారం, 25 నుంచి 35 పరుగుల తేడాతో సూపర్ ఓవర్ ద్వారా ఘన విజయం అందుకునే ఛాన్స్ ఉన్నదంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




