
India vs New Zealand Final Preview: టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో భారత జట్టు ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లాండ్ జట్టుపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ముంబైలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ ఛేజ్లో చివరి వరకు పోరాడినా 246 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
2022 నుంచి కొనసాగుతున్న ఆసక్తికర ట్రెండ్..
గత మూడు టీ20 వరల్డ్ కప్లలో కూడా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది.
2022 – సెమీఫైనల్లో ఇంగ్లాండ్ భారత్ను ఓడించింది. తర్వాత ఫైనల్లో పాకిస్తాన్ (Pakistan national cricket team) ను ఓడించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది.
2024 – సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ను ఓడించింది. ఆ తరువాత రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలో భారత్ ట్రోఫీ గెలిచింది.
2026లో కూడా అదే సీన్ రిపీట్ అవ్వనుందా..
ఇప్పుడు 2026లో కూడా భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడి 253 పరుగులు చేశారు. ఇందులో సంజూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఛేజ్లో ఇంగ్లాండ్ తరపున బెథెల్ శతకంతో పోరాడినా జట్టుకు విజయం సాధించలేకపోయాడు.
వరుసగా రెండోసారి టైటిల్ గెలిచే అవకాశం..
ఈ ట్రెండ్ను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన యాదృచ్ఛికం కనిపిస్తోంది.
సెమీఫైనల్లో భారత్ – ఇంగ్లాండ్ మ్యాచ్లో ఎవరు గెలిస్తే ఆ జట్టే తర్వాత టోర్నమెంట్ ఛాంపియన్ అవుతుంది.
2024లో భారత్ సెమీఫైనల్ గెలిచి టైటిల్ సాధించింది.
2026లో కూడా భారత్ ఇంగ్లాండ్ను ఓడించింది.
దీంతో భారత్ మళ్లీ వరల్డ్ ఛాంపియన్ అవుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.
ఫైనల్లో న్యూజిలాండ్తో పోరు..
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత జట్టు న్యూజిలాండ్ (New Zealand) తో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. భారత్ గెలిస్తే వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్లు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..