బంగాళాదుంపలు, యాపిల్లలో నల్లగా మారే ప్రక్రియను శాస్త్రీయంగా ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అంటారు. బంగాళాదుంపలు, యాపిల్ పండ్లలో ‘పాలీఫినాల్ ఆక్సిడేస్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ కోసే వరకు కణాల లోపల సురక్షితంగా ఉంటుంది. అయితే కోసిన తర్వాత, ఈ కణాలు గాలిలోని ఆక్సిజన్తో సంబంధంలోకి వస్తాయి. ఆక్సిజన్, ఎంజైమ్ల మధ్య రసాయన ప్రతిచర్య మెలనిన్ అనే వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీని వలన కోసిన ప్రాంతం నల్లగా లేదా గోధుమ రంగులో కనిపిస్తుంది. కట్ చేసిన బంగాళాదుంపలు, యాపిల్లు తాజాగా ఉంచడానికి మీరు ఖచ్చితంగా ఇంట్లో కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. బంగాళాదుంపలను కోసిన వెంటనే చల్లటి నీటిలో నానబెట్టాలి. ఇది గాలితో వాటి సంబంధాన్ని తెంచుకుంటుంది. దీంతో నల్లగా మారకుండా నిరోధిస్తుంది. ఇది సులభమైన చిట్కా.
యాపిల్ కోసి తర్వాత తినాలనుకుంటే ముక్కలపై కొంచెం నిమ్మరసం రాయాలి. నిమ్మకాయలోని విటమిన్ సి (యాంటీఆక్సిడెంట్) ఆక్సీకరణ ప్రక్రియను నెమ్మదిస్తుంది. అలాగే, ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని దానికి చిటికెడు ఉప్పు వేయాలి. అందులో బంగాళాదుంప లేదా యాపిల్ ముక్కలను ఉంచాలి. దీనివల్ల రంగు మారదు. యాపిల్ఎక్కువసేపు తాజాగా ఉంచాలనుకుంటే, రెండు కప్పుల నీటిలో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి అందులో యాపిల్ ముక్కలను ఉంచాలి. దాదాపు 3-5 నిమిషాల తర్వాత ముక్కలను తొలగించాలి. అలాగే కోసిన పండ్లను వెంటనే ఉపయోగించకూడదనుకుంటే, వాటిని క్లాంగ్ ఫిల్మ్తో గట్టిగా చుట్టండి లేదా రిఫ్రిజిరేటర్లో గాలి చొరబడని కంటైనర్లో నిల్వ చేయండి.
దీనితో పాటు బంగాళాదుంపలు లేదా యాపిల్ నల్లబడకుండా ఆపాలనుకుంటే ఒక గిన్నెలో నీరు తీసుకొని దానికి ఒక చెంచా వెనిగర్ కలపండి. కట్ చేసిన బంగాళాదుంపలు లేదా యాపిల్ ముక్కలను ఈ నీటిలో 2-3 నిమిషాలు ముంచండి. ఇది వాటి రంగును తెల్లగా, చాలా కాలం పాటు తాజాగా ఉంచుతుంది. కానీ తినడానికి లేదా వంట చేయడానికి ముందు వాటిని ఒకసారి సాధారణ నీటితో శుభ్రం చేసుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.