అనంతరం పరిమళ భరితమైన వివిధ రకాల పుష్పాలతో నారసింహుడిని సరస్వతీ దేవి రూపంలో అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారి తిరువీధి ఉత్సవం కనుల పండువగా సాగింది. భక్తులు తమ ఇంటి ముంగిట స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తిగీతాల ఆలాపనతో కదిరి పురవీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమోగాయి.బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు అత్యంత శక్తివంతమైన సింహ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వేడుకను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి, పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ మరియు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వరుస వాహన సేవలతో కదిరి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
మరిన్ని వీడియోల కోసం :