Ai+ స్మార్ట్ఫోన్ తన కొత్త మోడల్ పల్స్ 2ను మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. వినియోగదారుల రోజువారీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఫోన్లో నమ్మకమైన పనితీరు, దీర్ఘకాలిక బ్యాటరీ, మెరుగైన కెమెరా ఫీచర్లపై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ స్మార్ట్ఫోన్ మార్చి 11 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్కార్ట్లో విక్రయాలకు అందుబాటులో ఉంటుంది. పల్స్ 2 రెండు వేరియంట్లలో వస్తోంది 4GB + 64GB, 6GB + 128GB. ప్రత్యేక లాంచ్ ఆఫర్లో భాగంగా మొదటి 24 గంటల పాటు 4GB వేరియంట్ ధర రూ.5,999గా, 6GB వేరియంట్ ధర రూ.7,999గా నిర్ణయించారు.
కెమెరా విభాగంలో ఈ ఫోన్ 50MP డ్యూయల్ AI రియర్ కెమెరాతో వస్తోంది. ముఖ్యంగా సెల్ఫీ ప్రియుల కోసం ఫ్రంట్ కెమెరాను 5MP నుంచి 8MPకి అప్గ్రేడ్ చేశారు. దీంతో వివిధ లైటింగ్ పరిస్థితుల్లో స్పష్టమైన ఫోటోలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ విషయంలో కూడా గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. గత మోడల్లోని 5000mAh స్థానంలో ఈసారి 6000mAh బ్యాటరీను అందించారు. స్ట్రీమింగ్, గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులను ఎక్కువసేపు చేయగలిగేలా ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు.
డిస్ప్లే అనుభవాన్ని మెరుగుపరుస్తూ రిఫ్రెష్ రేట్ను 90Hz నుంచి 120Hzకి పెంచారు. అలాగే మన్నిక విషయంలో IP54 నుంచి IP64 రేటింగ్కు అప్గ్రేడ్ చేశారు, ఇది దుమ్ము, నీటి చిమ్మురుల నుంచి మెరుగైన రక్షణ ఇస్తుంది. సాఫ్ట్వేర్ పరంగా పల్స్ 2, Android 16 ఆధారిత NxtQuantum OSతో వస్తోంది. ఇది మరింత స్థిరమైన, వేగవంతమైన అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. డిజైన్ విషయానికి వస్తే ఆకుపచ్చ, నీలం, గులాబీ, ఊదా, నలుపు వంటి ఐదు ఆకర్షణీయ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. మొత్తంగా తక్కువ బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్లతో స్మార్ట్ఫోన్ కావాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుని పల్స్ 2ను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి