సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల పబ్లిసిటీ వ్యూహాలు నిరంతరం మారుతూ ఉంటాయి. ఇటీవలి కాలంలో, తాప్సీ పన్ను, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్లు ఫ్రీ పబ్లిసిటీని అందిపుచ్చుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. వారిద్దరూ ఒకే తరహా పంథాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. మృణాల్ ఠాకూర్ ప్రేమ, పెళ్లి వంటి వ్యక్తిగత విషయాలపై వ్యంగ్యంగా స్పందించడం ద్వారా భారీ ప్రచారం పొందారు. సినిమా విడుదలలకు ముందు, ఆ తర్వాత కూడా ఏదో ఒక విషయం మాట్లాడి ప్రజల దృష్టిని ఆకర్షించడంలో ఆమె ముందున్నారు. “ఎప్పుడూ జనాల మధ్య నలుగుతూ ఉండటం కన్నా కావాల్సింది ఏముంది” అని ఆమె వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోల కోసం :