సాధారణంగా రంజాన్ మాసం లో హలీమ్ తయారీ కోసం మాంసం వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే దొంగిలించిన పశువులను అక్రమంగా వధించి, హలీమ్ సెంటర్లకు లేదా మాంసం మార్కెట్లకు విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రద్దీగా ఉండే ఇరుకైన గల్లీల్లో పశువులను కట్టేసి ఉంచిన యజమానులు, ఉదయం లేచి చూసేసరికి అవి కనిపించకపోవడంతో లబోదిబోమంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో దొంగతనాలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. అయితే, దుండగులు ముఖాలకు ముసుగులు ధరించడం, వాహన నంబర్లు స్పష్టంగా లేకపోవడంతో పోలీసుల దర్యాప్తు సవాల్గా మారింది. పోలీసులు రాత్రి పహారా పెంచామని చెబుతున్నప్పటికీ, నిత్యం ఎక్కడో ఒకచోట చోరీలు జరుగుతూనే ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం :