పక్కన పెట్టాల్సిన టైం వచ్చింది.! కాటేరమ్మ కొడుకును పీకేయండి మహాప్రభో.. నెటిజన్ల డిమాండ్

పక్కన పెట్టాల్సిన టైం వచ్చింది.! కాటేరమ్మ కొడుకును పీకేయండి మహాప్రభో.. నెటిజన్ల డిమాండ్


Abhishek Sharma Poor Performance: టీ20 వరల్డ్ కప్ 2026లో అభిషేక్ శర్మ ఫామ్‌పై ఇప్పటికే సందేహాలు నెలకొన్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన సూపర్-8 చివరి కీలక మ్యాచ్‌లో ఆయన ప్రదర్శన మరింత నిరాశ కలిగించింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ బ్యాటింగ్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ విఫలమయ్యాడు. భారత జట్టుకు ట్రంప్ కార్డ్‌గా భావించిన అభిషేక్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వెస్టిండీస్‌పై కూడా పరిస్థితి మారలేదు.

బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలం..

వెస్టిండీస్ భారత్ ముందు 196 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓపెనర్‌గా దిగిన అభిషేక్ శర్మ కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు.

సాధారణంగా 2-4 బంతుల్లోనే 10 పరుగులు చేసే అభిషేక్, ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొని ఆ స్కోర్‌కు చేరుకున్నాడు. అంటే ఆయన స్ట్రైక్ రేట్ 100 కంటే కూడా తక్కువగా ఉండటం గమనార్హం. కీలక సమయంలో ఇలాంటి నెమ్మదైన ఇన్నింగ్స్ జట్టుపై ఒత్తిడిని పెంచింది.

ఫీల్డింగ్‌లో రెండు కీలక క్యాచ్‌లు మిస్..

బ్యాటింగ్‌లో విఫలమైన అభిషేక్ ఫీల్డింగ్‌లోనూ నిరాశపరిచాడు. మ్యాచ్‌లో రెండు ముఖ్యమైన క్యాచ్ అవకాశాలు వచ్చినా, వాటిని పట్టుకోలేకపోయాడు.

పవర్‌ప్లే 5వ ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రోస్టన్ చేజ్ (14 పరుగులు) ఇచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు.

19వ ఓవర్‌లో అర్షదీప్ సింగ్ బంతిపై రోవ్‌మన్ పావెల్ ఇచ్చిన మరో క్యాచ్‌ను కూడా మిస్ చేశాడు.

ఈ రెండు తప్పిదాలు వెస్టిండీస్ భారీ స్కోర్ 195 వరకు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాయి.

డగౌట్‌లో సరదాగా – విమర్శలు గుప్పించిన ఫ్యాన్స్..

మైదానంలో జరిగిన ఈ తప్పిదాల తర్వాత కూడా అభిషేక్ శర్మ డగౌట్‌లో నిర్లక్ష్యంగా, సరదాగా కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుంటే, ఆయన వైఖరిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మొత్తానికి, ఈ కీలక మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ప్రదర్శన భారత్‌కు గట్టి దెబ్బగా మారింది. సెమీఫైనల్ ఆశల మధ్య ఇలాంటి తప్పిదాలు జట్టుకు ఖరీదైనవిగా మారే ప్రమాదం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *