TTD: శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

TTD: శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి


కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకోనుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా, ఇకపై శ్రీవారి హుండీ కానుకలను డిజిటల్ పేమెంట్ రూపంలోనూ సమర్పించేలా టీటీడీ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు భక్తులు మొక్కుల రూపంలో శ్రీవారి హుండీలో చిల్లర నాణేలు వేస్తున్నారు. ఇకపై నాణేలకు బదులు ముడుపుపత్రాల రూపంలో వేసేందుకు వీలుగా తిరుపతి, తిరుమలలో టీటీడీ కేంద్రాలు ఏర్పాటు చేయడంపై సమావేశంలో చర్చించనున్నారు. భక్తులు తమ మొక్కులను UPI, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు. ఇందుకోసం తిరుమల, తిరుపతిలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ పద్ధతిలో నగదు చెల్లించిన భక్తులకు టీటీడీ అధికారికంగా ‘శ్రీవారి ముడుపు పత్రం’ అందజేస్తుంది. చిల్లర నాణేలకు బదులు ఈ ముడుపు పత్రాన్ని భక్తులు హుండీలో సమర్పించవచ్చు. హుండీ లెక్కింపు ప్రక్రియను మరింత సరళతరం చేయడంతో పాటు, పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. రోజుకు సగటున రూ. 4 కోట్ల ఆదాయం వచ్చే హుండీ నిర్వహణలో ఇది కీలక మార్పు కానుంది. అలాగే రూ. 100 నుండి రూ. 1 లక్ష వరకు డిజిటల్ పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పించనున్నారు. ఫిబ్రవరి 28న జరగనున్న టీటీడీ పాలక మండలి సమావేశంలో దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు. 2025లో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1,383 కోట్లు దాటగా, డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వస్తే భక్తులకు చిల్లర సమస్య ఉండదని, అలాగే టీటీడీకి నిర్వహణ భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trisha Krishnan: ‘ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా’త్రిష షాకింగ్ ట్వీట్!

Sree Vishnu: నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు’.. హీరో శ్రీవిష్ణు ఆవేదన

కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం

శ్రీకాకుళంలో డయేరియా మరణాలకు కారణం ఇదే

Yadadri: యాదాద్రిలో ‘శివసాయి శ్రీనివాస నాట్యాలయం’ కళాకారుల నాట్య నీరాజనం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *