భారత దేశీయ క్రికెట్లో సంచలన ఘట్టం నమోదైంది. రంజీ ట్రోఫీ (Ranji Trophy) చరిత్రలో తొలిసారి జమ్మూ & కాశ్మీర్ జట్టు టైటిల్ను కైవసం చేసుకుంది. హుబ్లీలోని కేఎస్సీఏ స్టేడియం (KSCA Stadium) వేదికగా జరిగిన ఫైనల్లో కర్ణాటకతో డ్రా సాధించిన జమ్మూ & కాశ్మీర్, తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించడం ద్వారా ట్రోఫీని అందుకుంది.
ఇది వారి తొలి ఫైనల్ ప్రదర్శన కావడం విశేషం. టోర్నమెంట్ చరిత్రలో తొలి ఫైనల్లోనే టైటిల్ గెలిచిన తొమ్మిదో జట్టుగా జమ్మూ & కాశ్మీర్ నిలిచింది.