ప్రస్తుతం యాప్ ఇన్స్టాలేషన్ సమయంలో మాత్రమే ఫోన్లో సిమ్ కార్డు ధృవీకరణను అడుగుతున్నాయి. ఒకసారి ఈ ధ్రువీకరణ ప్రాసెస్ అయ్యాక సిమ్ లేకపోయినా వాట్సప్, టెలిగ్రామ్, అరట్టై లాంటి సోషల్ మీడియా యాప్స్ పనిచేస్తున్నాయి. దీని వల్ల సైబర్ నేరగాళ్లు యాప్స్ను ఉపయోగించి అక్రమాలకు పాల్పడం ఈజీగా మారింది. ఈ సిమ్ బైండింగ్ నిబంధన వల్ల అక్రమాలు ఆగిపోనున్నాయి.